ప్రధాన మంత్రి కార్యాలయం
నవంబర్ 26 న రాజ్యాంగ దినం ఉత్సవాల లో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి
పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగే రాజ్యాంగ దినం కార్యక్రమాన్ని ఉద్దేశించిప్రధాన మంత్రి ప్రసంగిస్తారు
సర్వోన్నతన్యాయస్థానం ద్వారా విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటైనరాజ్యాంగ దినం ఉత్సవాల ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు
Posted On:
24 NOV 2021 5:08PM by PIB Hyderabad
దేశ ప్రజలు నవంబరు 26 న రాజ్యాంగ దినాన్నివేడుక గా జరుపుకోనున్నారు. భారతదేశరాజ్యాంగాని కి 1949వ సంవత్సరం లో నవంబరు26వ తేదీ నాడు రాజ్యాంగ పరిషత్తు అంగీకారం తెలిపిన సంఘటన ను స్మరించుకోవడం కోసంరాజ్యాంగ దినాన్ని నిర్వహించడం జరుగుతోంది. రాజ్యాంగ దినాన్ని నిర్వహించుకోవడం 2015వ సంవత్సరం లో మొదలైంది. ఈచరిత్రాత్మకమైన రోజు కు గల ప్రాముఖ్యానికి తగిన గుర్తింపు ను ఇవ్వాలన్న ప్రధానమంత్రి దృష్టి కోణం ఆధారం గా ఈ దినాన్ని పాటించడం జరుగుతోంది. ఈ దృష్టి కోణాని కి ఆధారం 2010వ సంవత్సరం లోగుజరాత్ కు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వారా నిర్వహించబడ్డ ‘‘సంవిధాన్ గౌరవ్ యాత్ర’’ లో ఇమిడి ఉండిఉండవచ్చును.ని కూడా ప్రారంభిస్తారు
ఈ సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాల లో భాగం గా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబరు 26 వ తేదీన పార్లమెంట్లోను, విజ్ఞాన్ భవన్ లోను ఏర్పాటయ్యేకార్యక్రమాల లో పాలుపంచుకోనున్నారు.
పార్లమెంట్ లో నిర్వహించే కార్యక్రమం ఉదయం 11 గంటల కు ఆరంభం అవుతుంది. కార్యక్రమాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో నిర్వహించడంజరుగుతుంది. కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులురాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ఇంకా లోక్ సభ స్పీకర్ ప్రసంగించనున్నారు. మాన్య రాష్ట్రపతి ప్రసంగం అనంతరం, ఆయన రాజ్యాంగపీఠిక ను చదువుతారు; రాజ్యాంగ పీఠిక ను రాష్ట్రపతి గారు చదవడాన్ని నేరు గా ప్రసారంచేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రత్యక్షప్రసారం సందర్భం లో దేశ ప్రజలు పాలుపంచుకొంటారు. మాననీయ రాష్ట్రపతి రాజ్యాంగపరిషత్తు లో జరిగిన చర్చల డిజిటల్ వర్శను ను, చక్కని దస్తూరి తో రాయబడినటువంటి భారతదేశరాజ్యాంగ ప్రతి తాలూకు డిజిటల్ వర్శను ను, ఇప్పటివరకు భారతదేశ రాజ్యాంగం లో చోటుచేసుకొన్న అన్ని సవరణల ను చేర్చినటువంటి రాజ్యాంగం యొక్క వర్తమాన వర్శను ను కూడాఆవిష్కరించనున్నారు. ఆయన ‘ఆన్లైన్ క్విజ్ ఆన్కాన్స్ టిట్యూశనల్ డెమోక్రసీ’ ని కూడాప్రారంభిస్తారు.
న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో గల ప్లీనరి హాల్లో సుప్రీం కోర్టు ద్వారా నిర్వహించబడేటటువంటి రెండు రోజుల రాజ్యాంగ దినం సంబంధి ఉత్సవాలను ప్రధాన మంత్రి సాయంత్రం 5:30 గంటల కు ప్రారంభిస్తారు.సర్వోన్నత న్యాయస్థానాని కి చెందిన అందరు న్యాయమూర్తులు, అన్ని ఉన్నత న్యాయస్థానాల ప్రధాన న్యాయమూర్తులు, ఇతర అత్యంత అనుభవజ్ఞులైన న్యాయమూర్తుల తో పాటు జూనియర్ న్యాయమూర్తులు, భారతదేశం యొక్క సాలిసిటర్ జనరల్, ఇంకా న్యాయ రంగం లోని అన్య సభ్యులుఈ సందర్భం లో పాలుపంచుకొంటారు. ప్రముఖుల సభను ఉద్దేశించి కూడా ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.
***
(Release ID: 1774747)
Visitor Counter : 137
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam