ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

116.87 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 33 లక్షలకు పైగా డోసులు నిర్వహణ

98.31 శాతానికి చేరిన రికవరీ రేటు

గత 24 గంటల్లో 8,488 కొత్త కేసులు నమోదు

క్రియాశీల కేసుల సంఖ్య 1,18,443

వారపు పాజిటివిటీ రేటు ( 0.93 శాతం ) గత 59 రోజులుగా 2 శాతం కంటే తక్కువ

Posted On: 22 NOV 2021 9:33AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 32,99,337 డోసులతో కలిపి, 116.87 కోట్ల డోసులను ( 1,16,87,28,385 ) టీకా కార్యక్రమం అధిగమించింది. 1,20,77,324 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,82,290

రెండో డోసు

94,07,092

 

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,76,108

రెండో డోసు

1,63,19,085

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

44,29,75,971

రెండో డోసు

19,15,97,004

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

18,08,59,227

రెండో డోసు

11,12,04,851

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

11,32,78,631

రెండో డోసు

7,43,28,126

మొత్తం

1,16,87,28,385

 

గత 24 గంటల్లో 12,510 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,39,22,037 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.31 శాతానికి చేరింది.

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 148వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 8,488 కొత్త కేసులు నమోదయ్యాయి.

క్రియాశీల కేసులు 2 లక్షల కంటే తక్కువగా, 1,18,443 వద్ద ఉన్నాయి. పాజిటివ్ కేసుల శాతం కూడా (0.34) 2020 మార్చి నుంచి కనిష్ట స్థాయి.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 7,83,567 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 63.25 కోట్లకు పైగా ( 63,25,24,259 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.93 శాతంగా ఉంది. గత 59 రోజులుగా 2 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.08 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 49 రోజులుగా 2 శాతం కంటే తక్కువగా, 84 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

 

****



(Release ID: 1773944) Visitor Counter : 129