ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌ వాహనశ్రేణిపై దాడిని ఖండించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 13 NOV 2021 6:31PM by PIB Hyderabad

   ణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ వాహన శ్రేణిపై బాంబు దాడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖండించారు. ఈ మేరకు ఇవాళ అమరులైన సైనికులు, వారి కుటుంబ సభ్యులకు ఆయన నివాళి అర్పించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో-

   “మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ వాహన శ్రేణిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిలో  అమరులైన సైనికులు, వారి కుటుంబ సభ్యులకు నివాళి అర్పిస్తున్నాను. వారి త్యాగం సదా చిరస్మరణీయం. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.

 

***

 

DS/VJ/AK


(రిలీజ్ ఐడి: 1771621) సందర్శకుల సూచీ సంఖ్య : : 159