బొగ్గు మంత్రిత్వ శాఖ
నవంబర్ చివరి నాటికి పవర్ ప్లాంట్లలో 18 రోజుల బొగ్గు నిల్వ ఉండేలా చూడాలని కోల్ ఇండియా లిమిటెడ్కు పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి
2024 నాటికి ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించే దిశగా వ్యూహాన్ని రూపొందించాలని సూచన
Posted On:
01 NOV 2021 4:17PM by PIB Hyderabad
ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి థర్మల్ పవర్ ప్లాంట్లలో కనీసం 18 రోజుల బొగ్గు నిల్వలు ఉండేలా అన్ని ప్రయత్నాలు చేయాలని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), దాని అనుబంధ సంస్థలను కేంద్ర బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ శాఖ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి కోరారు. వర్చువల్గా నిర్వహించిన సీఐఎల్ 47వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర మంత్రి శ్రీ జోషి, 2024 సంవత్సరం చివరి నాటికి ఒక బిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించేలా చర్యలను చేపట్టాలని సీఐఎల్కు పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి సవరించిన లక్ష్యాలను మరియు వివరణాత్మక వ్యూహాన్ని రూపొందించుకోవాలని కూడా బొగ్గు పీఎస్యుల సీఎండీలను ఆయన ఆదేశించారు. అంతర్జాతీయంగా బొగ్గు ధరలు ఇటీవల మూడు రెట్లకు పైగా పెరిగాయి. ఫలితంగా భారత్కు బొగ్గు దిగుమతులు 38 శాతం తగ్గాయని మంత్రి తెలిపారు.అదే సమయంలో విద్యుత్ డిమాండ్ 24 శాతానికి పైగా పెరిగిందన్నారు. ఇది బలమైన ఆర్థిక వృద్ధిని సూచిస్తుందన్నారు.సీఐఎల్ సంస్థ యొక్క అంకిత భావంతో కూడిన మానవ శక్తిని ప్రశంసించారు. శ్రీ ప్రహ్లాద్ జోషి ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాలలోని బొగ్గు గనులను సందర్శించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కోవిడ్ -19 కారణంగా లాక్డౌన్ రోజులలో కూడా, బొగ్గు యోధులు దేశం యొక్క ఇంధన భద్రతను నిర్ధారించడానికి 24 గంటలూ పని చేశారని ఆయన అన్నారు. బొగ్గు, గనులు మరియు రైల్వేల శాఖ సహాయ మంత్రి శ్రీ రావుసాహెబ్ పాటిల్ దాన్వే స్థాపన దినోత్సవం మరియు అవార్డుల కార్యక్రమం ప్రసంగించారు, దేశంలో అందుబాటులో ఉన్న భారీ బొగ్గు నిక్షేపాలను ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సీఐఎల్ ఇటీవలి అద్భుతమైన పనితీరును కనబరించిందని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ముఖ్యంగా సామాజిక బాధ్యత రంగంలో చేసిన కృషికి మంత్రి అభినందనలు తెలిపారు. బొగ్గు సరఫరాలో ఇటీవలి కొరతను అధిగమించడంలో సీఐఎల్ దాని అనుబంధ సంస్థలు పోషించిన అద్భుతమైన పాత్రను ప్రధానంగా ప్రస్తావించారు. సీఐఎల్ నాయకత్వాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ జైన్ అభినందించారు. కోల్కతాలోని సీఐఎల్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు జరిగిన ఈ 47వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా, సీఎండీ శ్రీ ప్రమోద్ అగర్వాల్ మాట్లాడుతూ పర్యావరణ నిర్వహణ, బొగ్గు ఉత్పత్తి, ఆఫ్ టేక్, సీఎస్ఆర్ చొరవ వంటి వివిధ విభాగాలలో వివిధ బొగ్గు పీఎస్యూలకు కార్పొరేట్ అవార్డులను అందజేశారు.
(Release ID: 1768846)
Visitor Counter : 183