హోం మంత్రిత్వ శాఖ

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం 100 కోట్ల కోవిడ్ -19 టీకాలు సాధించిన చారిత్రాత్మక మరియు గర్వించదగిన క్షణం అని కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు


"ఈ రోజు శ్రీ నరేంద్ర మోదీ యొక్క దూరదృష్టి గల నాయకత్వం మరియు నిరంతర ప్రోత్సాహం కారణంగా భారతదేశం 100 కోట్ల కంటే ఎక్కువ కోవిడ్ -19 టీకాల లక్ష్యాన్ని సాధించడం ద్వారా రికార్డు సృష్టించింది. ఇది సరికొత్త భారతదేశం యొక్క అపారమైన సామర్థ్యాలను ప్రపంచాన్ని తిరిగి పరిచయం చేసింది"

"ఈ చారిత్రాత్మక విజయానికి నేను దేశాన్ని అభినందిస్తున్నాను మరియు అనేక సవాళ్లను అధిగమించి ఈ గొప్ప పనిలో సహకరించిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు మరియు ఆరోగ్య కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు ప్రతి వ్యక్తి యొక్క భద్రత మరియు ఆరోగ్యం పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న శ్రీ నరేంద్ర మోదీని అభినందిస్తున్నాను"

Posted On: 21 OCT 2021 12:34PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 100 కోట్ల మందికి పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ వేసినందుకు కేంద్ర హోం మరియు సహకారశాఖ మంత్రి శ్రీ అమిత్ షా దేశాన్ని అభినందించారు. ఇది చారిత్రాత్మక మరియు గర్వించదగిన క్షణం అని ఆయన అభివర్ణించారు.

శ్రీ అమిత్ షా తన వరుస ట్వీట్లలో “చారిత్రాత్మక మరియు గర్వించదగిన క్షణం! ఈ రోజు, శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టి గల నాయకత్వం మరియు నిరంతర ప్రోత్సాహం ద్వారా భారతదేశం 100 కోట్ల కంటే ఎక్కువ కోవిడ్ -19 టీకాల లక్ష్యాన్ని సాధించడం ద్వారా రికార్డు సృష్టించింది. ఇది న్యూ ఇండియా యొక్క అపారమైన సామర్థ్యాలను ప్రపంచం మొత్తానికి  పరిచయం చేసింది.."


ఈ  మైలురాయిని సాధించడంలో సహకరించిన దేశంలోని శాస్త్రవేత్తలు, పరిశోధకులు మరియు ఆరోగ్య కార్యకర్తలందరికీ కేంద్ర హోం మరియు సహకార మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన సందర్భంగా  నేను దేశానికి అభినందనలు తెలుపుతున్నాను మరియు అనేక సవాళ్లను అధిగమించి ఈ గొప్ప పనిలో సహకరించిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు మరియు ఆరోగ్య కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  ప్రతి వ్యక్తి యొక్క భద్రత మరియు ఆరోగ్యం పట్ల నిబద్ధతతో వ్యవహారిస్తున్న శ్రీ నరేంద్ర మోదీని అభినందిస్తున్నాను " అని తెలిపారు.


 

*****



(Release ID: 1765448) Visitor Counter : 144