ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

100 కోట్ల కొవిడ్‌ టీకాలతో అరుదైన ఘనత సాధించిన భారత్‌


98.15 శాతానికి చేరిన రికవరీ రేటు; 2020 మార్చి నుంచి గరిష్ట స్థాయి

గత 24 గంటల్లో 18,454 కొత్త కేసులు నమోదు

క్రియాశీల కేసుల సంఖ్య 1,78,831

వారపు పాజిటివిటీ రేటు (1.34 శాతం) గత 118 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

Posted On: 21 OCT 2021 11:44AM by PIB Hyderabad

భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం నిన్నటితో అరుదైన ఘనత సాధించింది. ప్రజలకిచ్చిన మొత్తం డోసుల సంఖ్య 100 కోట్లను దాటింది. ఈ సందర్భంగా దేశ ప్రజలను అభినందిస్తూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. ఈ అద్భుత ఘనత సాధించడానికి కృషి చేసిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు.

100 కోట్ల డోసుల మైలురాయిని సాధించినందుకు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.మన్‌సుఖ్ మాండవీయ కూడా దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు.

గత 24 గంటల్లో 17,561 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,34,95,808 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.15 శాతానికి చేరింది. 2020 మార్చి నుంచి ఇదే గరిష్ట స్థాయి.

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 116వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 18,454 కొత్త కేసులు నమోదయ్యాయి. 

క్రియాశీల కేసులు 2 లక్షల కంటే తక్కువగా, 1,78,831 గా ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇది 0.52 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 12,47,506 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 59.57 కోట్లకు పైగా (59,57,42,218) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.34 శాతంగా ఉంది. గత 118 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.48 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 52 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 135 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

 

****



(Release ID: 1765445) Visitor Counter : 236