ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 17 OCT 2021 9:30AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 97.65 కోట్ల డోసులను అందించారు.

గత 24 గంటల్లో 14,146 కొత్త కేసులు నమోదయ్యాయి; ఇది 229 రోజుల కనిష్ట స్థాయి.

రికవరీ రేటు 98.10% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 19,788 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,34,19,749 కు పెరిగింది.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.57% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,95,846. ఇది 220 రోజుల కనిష్ట స్థాయి.

వారపు పాజిటివిటీ రేటు (1.42%) గత 114 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

రోజువారీ పాజిటివిటీ రేటు (1.29%) గత 48 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 59.09 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

****



(Release ID: 1764516) Visitor Counter : 157