ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
17 OCT 2021 9:30AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 97.65 కోట్ల డోసులను అందించారు.
గత 24 గంటల్లో 14,146 కొత్త కేసులు నమోదయ్యాయి; ఇది 229 రోజుల కనిష్ట స్థాయి.
రికవరీ రేటు 98.10% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.
గత 24 గంటల్లో 19,788 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,34,19,749 కు పెరిగింది.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.57% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,95,846. ఇది 220 రోజుల కనిష్ట స్థాయి.
వారపు పాజిటివిటీ రేటు (1.42%) గత 114 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.
రోజువారీ పాజిటివిటీ రేటు (1.29%) గత 48 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.
ఇప్పటివరకు 59.09 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
****
(Release ID: 1764516)
Visitor Counter : 189