ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

79 కోట్ల డోసుల మైలురాయి దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం

రికార్డు స్థాయిలో 24 గంటల్లోనే 2.5 కోట్ల డోసులు పంపిణీ

97.65 శాతానికి చేరిన రికవరీ రేటు

గత 24 గంటల్లో 35,662 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (3,40,639) 1.02 శాతం

వారపు పాజిటివిటీ రేటు (2.02 శాతం) గత 85 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

Posted On: 18 SEP 2021 1:53PM by PIB Hyderabad

కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భారత్‌ మరో రికార్డు సృష్టించింది. రికార్డు స్థాయిలో ఒక్కరోజులోనే 2.5 కోట్లకుపైగా డోసులను ప్రజలకు అందించింది. దీంతో, టీకా కార్యక్రమం 79 కోట్ల (79,42,87,699) డోసుల మైలురాయిని దాటింది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన టీకా డోసులు 2.15 కోట్లుగా ఉండగా, రాష్ట్రాలు నివేదించిన ప్రకారం 2.5 కోట్లకు పైగా ఉన్నాయి. 78,49,738 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చే తుది నివేదిక ప్రకారం, రోజువారీ టీకాల కచ్చిత సంఖ్యను నవీకరిస్తారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,67,858

రెండో డోసు

86,96,165

 

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

1,83,43,570

రెండో డోసు

1,44,00,387

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

32,12,63,332

రెండో డోసు

5,62,22,452

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

14,93,59,311

రెండో డోసు

6,77,70,267

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

9,61,06,803

రెండో డోసు

5,17,57,554

60 ఏళ్లు పైబడినవారు

79,42,87,699

 

ఈ అద్భుత విజయం పట్ల దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ట్విట్టర్‌ ద్వారా అభినందనలు తెలుపుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు:

"రికార్డు స్థాయి టీకా కార్యక్రమంపై ప్రతి భారతీయుడు గర్విస్తాడు"

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002HVFX.png

 

ఈ రికార్డు సాధించినందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయ కూడా దేశ ప్రజలను అభినందించారు. దేశంలోని ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి ఈ విజయాన్ని అంకితం చేశారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0033DMW.png

 

గత 24 గంటల్లో 33,798 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,26,32,222 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 97.65 శాతానికి చేరింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0046DSX.jpg

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 83వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 35,662 కొత్త కేసులు నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005D4W2.jpg

 

ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 3,40,639. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇది 1.02 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0069PUH.jpg

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 14,48,833 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 55.07 కోట్లకుపైగా (55,07,80,273) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 2.02 శాతంగా ఉంది. గత 85 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.46 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 19 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 102 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007AB1V.jpg



(Release ID: 1756111) Visitor Counter : 147