కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

భారత ప్రభుత్వం ఈ-శ్రామ్ పోర్టల్‌ను ప్రారంభించినందున దేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికుల నమోదు ప్రారంభమవుతుంది.


దేశంలో అసంఘటిత కార్మికుల సమగ్ర జాతీయ డేటాబేస్ (ఎన్‌డియుడబ్లు) ను రూపొందించడానికి పోర్టల్ సహాయం చేస్తుంది.

కోట్లాది మంది అసంఘటిత కార్మికుల సంక్షేమ పథకాలను చివరి దశవరకూ అందించడానికి పోర్టల్ భారీ సహయాన్ని అందిస్తుంది: శ్రీ భూపేందర్ యాదవ్

దేశ చరిత్రలో ఇది గొప్ప మలుపు, ఇక్కడ 38 కోట్ల మంది కార్మికులు తమను తాము ఒక పోర్టల్ కింద నమోదు చేసుకుంటారు.

రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం కార్మికులు ఇందు కోసం ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు.

Posted On: 26 AUG 2021 6:13PM by PIB Hyderabad

కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈ రోజు ఈ-శ్రామ్ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించారు.   కార్మిక, ఉపాధి మరియు పెట్రోలియం & సహజ వాయువుల సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి సమక్షంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు  అందజేశారు.

భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 38 కోట్ల మంది అసంఘటిత కార్మికులను నమోదు చేయడానికి ఒక వ్యవస్థ తయారు చేయబడింది. ఇది వారిని నమోదు చేయడమే కాకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సామాజిక భద్రతా పథకాలను అందించడంలో సహాయకరంగా ఉంటుంది ”అని అలాగే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పం మేరకు కార్మికులకు సంక్షేమాన్ని అందించడానికి ఇది మరో కీలక మైలురాయి అని కార్మిక మంత్రి నొక్కి చెప్పారు. అసంఘటిత కార్మికులు భారతదేశ  నిర్మాతలని తెలిపారు.

ఈ సందర్భంగా, శ్రీ భూపేందర్ యాదవ్ ఈ శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న ప్రతి అసంఘటిత కార్మికుడికి రూ. 2.0 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని మంజూరు చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న ఒక కార్మికుడు ప్రమాదానికి గురై మరణం లేదా శాశ్వత వైకల్యానికి గురైతే రూ. 2.0 లక్షలు మరియు పాక్షిక వైకల్యంపై రూ .1.0 లక్షలకు అర్హత పొందుతారు. మరియు కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది.

కార్మిక, ఉపాధి మరియు పెట్రోలియం & సహజ వాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలీ ఈ-శ్రమ్‌ పోర్టల్ యొక్క లక్షణాలను హైలైట్ చేస్తూ అసంఘటిత కార్మికులందరి జాతీయ డేటాబేస్‌ని సృష్టించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అసంఘటిత కార్మికులందరినీ ఈ-శ్రామ్ పోర్టల్‌లో నమోదు చేయబడతారు. మరియు భారత ప్రభుత్వం యొక్క అత్యంత అవసరమైన లక్ష్యాన్ని నెరవేర్చడంలో భాగస్వాము అవ్వాలంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. " ఏ కార్మికుడు వదిలివేయబడడు. పథకాలు అందరికీ చేరుతాయి."

ఈ సందర్భంగా మంత్రులు ఇద్దరూ కూడా అజ్మీర్, దిబ్రూగర్, చెన్నై మరియు వారణాసికి చెందిన కార్యకర్తలతో సంభాషించారు. వారు కామన్‌ సర్వీస్‌ సెంటర్స్‌ నుండి వర్చువల్‌గా కనెక్ట్‌ అయ్యారు. వారి అనుభవాలు మరియు అంచనాలను పంచుకున్నారు. బీమా పథకాల గురించి వారికి యాదవ్ మరియు శ్రీ తేలి  వివరించారు మరియు పోర్టల్‌లో నమోదు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

దేశ చరిత్రలో ఈ పోర్టల్ ఒక పెద్ద మలుపు మరియు గేమ్ ఛేంజర్ అని పేర్కొంటూ కార్మిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర దేశంలో 38 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులు (యుడబ్లూ) ఒకే పోర్టల్ కింద నమోదు చేయబడతారని చెప్పారు. మరియు ఈ-శ్రమ్‌  పోర్టల్ కింద నమోదు పూర్తిగా ఉచితం మరియు కార్మికులు అతను లేదా ఆమె రిజిస్ట్రేషన్ కోసం కామన్ సర్వీస్ సెంటర్లలో (సిఎస్‌సిలు) లేదా ఎక్కడైనా ఎలాంటి చెల్లింపులు అవసరం లేకుండా నమోదు కావొచ్చు.

రిజిస్టర్ అయిన తర్వాత కార్మికులకు ప్రత్యేకమైన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యుఎఎన్‌) తో శ్రామ్ కార్డు జారీ చేయబడుతుంది మరియు ఈ కార్డ్ ద్వారా వివిధ సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలను ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సెస్ చేయగలరని శ్రీ చంద్ర మరింత సమాచారం అందించారు.

ప్రధాన కార్యదర్శులు, అదనపు ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు (లేబర్), అన్ని రాష్ట్రాల/ కేంద్రపాలిత ప్రాంతాల లేబర్ కమీషనర్లుతో పాటు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల కార్మిక మంత్రులు ఆయా రాష్ట్రాల నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈపిఎఫ్‌ఓ మరియు ఈఎస్‌ఐసీ యొక్క ప్రాంతీయ కార్యాలయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక మంత్రిత్వ శాఖ మరియు కార్మిక శాఖల అన్ని ఫీల్డ్ కార్యాలయాలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అసంఘటిత కార్మికుల నమోదులో కీలక పాత్ర పోషిస్తున్న 4 లక్షలకు పైగా సాధారణ సేవా కేంద్రాలు (సిఎస్‌సిలు) కూడా ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నాయి.

పోర్టల్ యొక్క ప్రదర్శన ఇప్పటికే అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు జూలై/ ఆగస్టులో వారితో నిర్వహించిన 1 వ మరియు 2 వ ప్రీ-లాంచింగ్ సమావేశాలలో ఇవ్వబడింది. ఈ విషయంలో పోర్టల్ నిర్వహణ మరియు కార్మికుల సమీకరణ కోసం వివరణాత్మక మార్గదర్శకాలు ఇప్పటికే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు జారీ చేయబడ్డాయి. కొవిడ్‌ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని దేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికుల నమోదు ప్రక్రియను ప్రారంభించడానికి పోర్టల్‌ను వెంటనే ప్రారంభించి రాష్ట్రాలకు అప్పగించాలని నిర్ణయించారు. కేంద్ర కార్మిక మంత్రి 24 ఆగష్టు, 2021 న దేశంలోని ప్రధాన కేంద్ర కార్మిక సంఘాల నాయకులతో కూడా సంభాషించారు. భారతీయ మజ్దూర్ సంఘం (ఎంఎస్‌), ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఇంటాక్‌), ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటియూసి), హిందూ మహాసభ (హెచ్‌ఎంఎస్‌), సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సిఐటియు), ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంటర్ (ఏఐయుటియుసీ), ట్రేడ్ యూనియన్ సమన్వయ కేంద్రం (టియుసిసి), స్వయం ఉపాధి మహిళా సంఘం (ఎస్‌ఈడబ్లుఎ), యునైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంటర్ (యుటియుసి), నేషనల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (డిహెచ్‌ఎన్‌లు) సంఘాలు పాల్గొన్నాయి.

ఇది దేశానికి దేశ నిర్మాతలు అయిన అసంఘటిత కార్మికుల శ్రేయస్సు కోసం ఇది ఒక గేమ్ ఛేంజర్ అని సెంట్రల్ ట్రేడ్ యూనియన్‌ల నాయకులు మరియు అన్ని కేంద్ర ట్రేడ్ యూనియన్లు మరియు రాష్ట్రాలలో వారి క్షేత్ర నిర్మాణాలు అని స్పష్టంగా చెప్పారు. అసంఘటిత కార్మికులను ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేయడానికి గౌరవప్రదమైన కారణానికి దాని నిరంతర మద్దతును అందించాలని రాష్ట్రాలను కోరారు.


 

***



(Release ID: 1749624) Visitor Counter : 778