ప్రధాన మంత్రి కార్యాలయం

జర్మనీ ప్రధానమంత్రి ఫెడరల్ ఛాన్సలర్ డాక్టర్ ఏంజెలా మెర్కెల్‌ తో ఫోన్‌ లో మాట్లాడిన - భారత ప్రధానమంత్రి

Posted On: 23 AUG 2021 8:29PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జర్మనీ ప్రధానమంత్రి ఫెడరల్ ఛాన్సలర్ డాక్టర్ ఏంజెలా మెర్కెల్‌ తో ఫోన్‌ లో మాట్లాడారు.

 
ఆఫ్ఘనిస్తాన్‌ లో కొనసాగుతున్న భద్రతా పరిస్థితి, మరియు ఈ ప్రాంతంతో పాటు ప్రపంచం పై దాని ప్రభావాలపై ఇరువురు నాయకులు చర్చించారు.  శాంతి, భద్రతలను కాపాడటం యొక్క ప్రాముఖ్యతను వారు నొక్కిచెప్పారు. ఒంటరిగా చిక్కుకు పోయిన వ్యక్తులను స్వదేశానికి రప్పించడం ప్రస్తుతం అత్యంత అత్యవసర ప్రాధాన్యతగా ఉందని వారు గుర్తించారు. 
 

కోవిడ్ -19 టీకాలు వేయడంలో సహకారం;   వాతావరణం మరియు శక్తిపై దృష్టి సారించి అభివృద్ధి సహకారం; వాణిజ్యం మరియు ఆర్థిక సంబంధాలను పెంపొందించడం తో సహా, ద్వైపాక్షిక ఎజెండా లోని అంశాలపై కూడా ఇద్దరు నాయకులు చర్చించారు.  రాబోయే సి.ఓ.పి.-26 సమావేశం వంటి బహుపాక్షిక ఆసక్తి అంశాలతో పాటు,  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సముద్ర భద్రతపై సంభాషణను ప్రోత్సహించడానికి భారత చొరవ వంటి అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలను ఒకరికొకరు తెలియజేసుకున్నారు.  ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సమ్మిళిత సహకారాన్ని ప్రోత్సహించడం పై ఇరుపక్షాల మధ్య దృక్పథాల సాధారణత ను వారు నొక్కి చెప్పారు.

 

*****



(Release ID: 1748422) Visitor Counter : 172