యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

టోక్యో 2020 పారాలింపిక్ క్రీడలకు వెళ్లే భారత క్రీడాకారులు బృందంతో ఈ నెల 17వ తేదీన మాట్లాడనున్న గౌరవ ప్రధాన మంత్రి

Posted On: 16 AUG 2021 11:53AM by PIB Hyderabad
టోక్యో 2020 పారాలింపిక్ గేమ్స్ లో పాల్గొనున్న భారత పారా అథ్లెట్ బృందంతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగష్టు 17 న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు. 9 క్రీడా విభాగాలకు చెందిన 54 మంది పారా అథ్లెట్లు దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి టోక్యోకు వెళ్తున్నారు. పారాలింపిక్ క్రీడలకు భారతదేశంలో ఇదే అతిపెద్ద బృందం. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా మంత్రి కూడా పాల్గొంటారు.

 

 

***



(Release ID: 1746361) Visitor Counter : 172