ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 48.93 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ

కోలుకున్నవారి శాతం 97.37%

గత 24 గంటల్లో 42,982 కొత్త కోవిడ్ కేసులు
ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు 4,11,076); మొత్తం కేసుల్లో 1. 29%
రోజువారీ పాజిటివిటీ 2.58%; 10 రోజులుగా 3% లోపే

Posted On: 05 AUG 2021 10:19AM by PIB Hyderabad

భారతదేశమంతటా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 48.93  కోట్లు దాటింది. 57,21,937 శిబిరాల ద్వారా మొత్తం 48,93,42,295 టీకా డోసుల పంపిణీ పూర్తయినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం సూచిస్తోంది. గత 24 గంటలలో 37,55,115 టీకాలిచ్చారు.  ఆ వివరాలు ఇలా ఉన్నాయి:       

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,03,21,218

రెండో డోస్

79,16,997

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,80,12,481

రెండో డోస్

1,15,34,779

18-44 వయోవర్గం

మొదటి డోస్

16,64,37,738

రెండో డోస్

1,02,76,584

45-59 వయోవర్గం

మొదటి డోస్

10,90,91,506

రెండో డోస్

4,09,44,600

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

7,72,63,332

మొదటి డోస్

3,75,43,060

మొత్తఁ

48,93,42,295

 

సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు   చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటి దాకా 3,09,74,748 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో 41,726 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్నవారి శాతం  97.37% అయింది.

 

గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  42,982 కొత్త కేసులు నమోదయ్యాయి. 39 రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది.

ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో  ఉన్నవారు 4,11,076 మంది. చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 1.29% మాత్రమే

 

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో  16,64,030 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 47.48 కోట్లకు పైగా (47,48,93,363) అయ్యాయి.

ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ  తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  2.37% కాగా రోజువారీ పాజిటివిటీ  2.58%  అయింది. వరుసగా 59 రోజులుగా ఇది 5% లోపే ఉంటోంది.

 

****



(Release ID: 1742734) Visitor Counter : 238