మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

'పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్' పథకం కింద సహాయం పొందడానికి ఉండాల్సిన అర్హతలను తెలుసుకోవడానికి, దరఖాస్తులను సమర్పించడానికి వెబ్ ఆధారిత పోర్టల్ pmcaresforchildren.in ను ప్రారంభించిన మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సుస్థిర విధానం ద్వారా అనాధ పిల్లలకు సంరక్షణ, రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో రూపొందిన 'పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్' పథకం

Posted On: 25 JUL 2021 7:20PM by PIB Hyderabad

'పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్పథకం కింద సహాయం పొందడానికి ఉండాల్సిన అర్హతలను తెలుసుకోవడానికి, దరఖాస్తులను సమర్పించడానికి, అందిన దరఖాస్తులను పరిశీలించడానికి  మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెబ్ ఆధారిత పోర్టల్ pmcaresforchildren.in ను ప్రారంభించింది. పిల్లల పేర్ల నమోదు మరియు లబ్ధిదారుల గుర్తించడానికి మాడ్యూల్ పనిచేయడం ప్రారంభించింది. దీనిలో అవసరమైన తాజా సమాచారం, నమూనాలను పొందుపరచడం జరుగుతుంది. 

కోవిడ్-19 బారిన పడి తల్లితండ్రులను, చట్టపరమైన సంరక్షకులు లేదా దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన పిల్లలను ఆదుకోవడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్పథకాన్ని ప్రకటించారు. తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలను ఒక సుస్థిర పద్ధతిలో ఆదుకునే విధంగా పథకానికి రూపకల్పన జరిగింది. ఆరోగ్య భీమాను కల్పించి, చదువుకునే అవకాశాలు కల్పించి వారికి 23 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ పథకం కింద కల్పిస్తారు. 

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మహిళా, శిశు అభివృద్ధి/ సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వశాఖల  కార్యదర్శి/ కార్యదర్శులకు 15.07.21 న పథకం సమగ్ర వివరాలను తెలియజేయడం జరిగింది.  జిల్లా న్యాయాధికారులుజిల్లా శిశు సంరక్షణ యూనిట్లు మరియు శిశు సంక్షేమ అధికారుల లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్‌లు కూడా మహిళాశిశు అభివృద్ధి శాఖలు / సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖలకు అందజేసి వాటిని  సంబంధిత అధికారులకు పంపాలని కోరడం జరిగింది. 

జిల్లా మెజిస్ట్రేట్లను తమ జిల్లాలో 'పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్పథకం కింద సహాయం పొందడానికి అర్హత కలిగిన పిల్లలను గుర్తించి వారికి తక్షణ సాయం అందించడానికి వారి వివరాలను పంపాలని,  pmcaresforchildren.in పోర్టల్‌కు ప్రచారం కల్పించాలని సూచిస్తూ 2021 జూలై 22వ తేదీన అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు / కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లకు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమాచారం పంపింది. కింది సూచించిన అనుబంధం లో పొందుపరచిన విధంగా అర్హతలు కలిగిన పిల్లల పేర్లను నమోదు చేయడానికి చర్యలు తీసుకోవాలని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచించింది. దీనిని 15 రోజుల లోగా పూర్తి చేయాలని సూచించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు అయ్యింది.టెలిఫోన్ నెంబర్  011-23388074 లేదా pmcares-children.wcd[at]nic[dot]in ఇమెయిల్ ద్వారా దీనిని సంప్రదించవచ్చును. 

 పోర్టల్‌లో డేటా ఎంట్రీ పురోగతిని వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని  రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు / కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లను మంత్రిత్వ శాఖ కోరింది .

అనుబంధం :

'పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్పథకం కింద సహాయం పొందడానికి పిల్లలను గుర్తించడం.

అర్హత:

i )తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన  లేదా

ii ) తల్లి/ తండ్రిని కోల్పోయిన లేదా 

iii )11.03.2020 నుంచి  మహమ్మారి ముప్పు తొలగిపోయేంత వరకు  కోవిద్-19 మహమ్మారి కారణంగా చట్టపరమైన సంరక్షకుడు / పెంపుడు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఈ పథకం కింద ప్రయోజనాలను పొందడానికి అర్హులుగా ఉంటారు.

ప్రక్రియ:

 

1.  పోలీసుడిసిపియుచైల్డ్‌లైన్ పౌర సంస్థల సహకారంతో ఈ పిల్లలను గుర్తించడానికి జిల్లా మేజిస్ట్రేట్ కార్యక్రమాన్ని చేపట్టవలసి ఉంటుంది

 

2.  అటువంటి పిల్లల వివరాలను  సిడబ్ల్యుసికి తెలియజేసేవిధంగా గ్రామ పంచాయతీలుఅంగన్వాడి మరియు ఆశా నెట్‌వర్క్ సహకారాన్నిపొందవచ్చు.

 3. గుర్తింపు కార్యక్రమంపై స్థానిక భాషలో తగినంత ప్రచారం కల్పించి దీని ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసి అనాధ పిల్లల వివరాలను సిడబ్ల్యుసికి లేదా చైల్డ్ లైన్ (1098) లేదా డిసిపియుకి అందించేలా చర్యలు అమలు చేయాల్సి ఉంటుంది.

4. కోవిడ్ కారణంగా తల్లితండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన పిల్లలను వారిని గుర్తించిన 24 గంటల లోగా ( ప్రయాణ సమయం కాకుండా) CWC ముందు చైల్డ్‌లైన్ (1098), జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్  లేదా మరే ఇతర ఏజెన్సీ లేదా వ్యక్తి ఎదుట అయినా ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది.

5.  ఈ పథకం కింద సహాయం కోరుతూ పిల్లవాడు లేదా సంరక్షకుడు లేదా సిడబ్ల్యుసి ముందు పిల్లలను తీసుకుని వచ్చిన  ఏజెన్సీ అయినా దరఖాస్తును  నింపవచ్చు.

6. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సంబంధించిన పూర్తి వివరాలను డిసిపియు సహాయంతో  సిసిడబ్ల్యుసి  సేకరిస్తుంది. మరణించిన తల్లిదండ్రుల వివరాలుఇంటి చిరునామాపాఠశాలసంప్రదింపు వివరాలుఆధారాలు మరియు విస్తరించిన కుటుంబ సభ్యులుబంధువులు లేదా బంధువులు మరియు బంధువుల వార్షిక ఆదాయంతో సహా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సంబంధించిన అన్ని వివరాలను సేకరిస్తారు. మరణ ధృవీకరణ పత్రం ద్వారా లేదా క్షేత్రస్థాయి విచారణ ద్వారాతల్లిదండ్రుల మరణానికి గల కారణాలను సిడబ్ల్యుసి ధృవీకరించాలి.డిఎమ్ పరిశీలన కోసం  పంపుతూ పిఎమ్ కేర్స్‌ పోర్టల్ లో  వీటిని సిడబ్ల్యుసి అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. 

7. తమ వద్ద ఉన్న  పిల్లల వివరాలను పోర్టల్‌లో ఇతర ఏజెన్సీల ద్వారా సిడబ్ల్యుసి అప్‌లోడ్ చేయవచ్చు.

8.  వాస్తవాలను నిర్ధారించిన తరువాత సిడబ్ల్యుసి తన సిఫార్సులను డిఎమ్ కి సమర్పిస్తుంది. 

9.  ఒకవేళ సిడబ్ల్యుసి ఒక  పిల్లవాడిని సిఫార్సు  చేయకపోతేదీనికి గల కారణాలను  ఇచ్చిన స్థలంలో నమోదు చేయవలసి ఉంటుంది. దీనిపై డిఎమ్  తగిన చర్య తీసుకుంటారు. 

10. దరఖాస్తుల  పరిశీలనలో మొదట వచ్చినవారికి తొలి ప్రాధాన్యత సూత్రాన్ని అమలు చేయాలి. 

11.  సిడబ్ల్యుసి సిఫార్సులను  డిఎమ్ అంగీకరించవచ్చు లేదా సిడబ్ల్యుసి లేదా డిసిపియు సమీక్ష కోరవచ్చు. సిడబ్ల్యుసి సిఫార్సు  చేసిన లేదా సిఫార్సు చేయని  పిల్లలపై  డిఎమ్ స్వతంత్ర అంచనా వేయవచ్చు. డిఎమ్ కి చైల్డ్ ప్రొటెక్షన్ స్టాఫ్పోలీస్చైల్డ్ లైన్ లేదా ఏ ఇతర ఏజెన్సీ అయినా సహాయపడవచ్చు.

12. అన్ని అంశాలను పరిశీలించిన తరువాత  ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హత గలవారి జాబితాను డిఎమ్ సిద్ధం చేస్తారు.  ఈ పథకం కింద పిల్లల అర్హతపై డిఎం తీసుకున్న నిర్ణయం అంతిమంగా ఉంటుంది.



(Release ID: 1738974) Visitor Counter : 353