ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రజల పద్మ పురస్కారాల కోసం ప్రేరణమూర్తుల ను నామనిర్దేశం చేయాలని పౌరులకు విజ్ఞప్తి చేసిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 11 JUL 2021 11:03AM by PIB Hyderabad

క్షేత్ర స్థాయి లో ప్రశంసాయోగ్యమైన కృషి ని చేస్తున్నటువంటి, ప్రజల కు అంతగా తెలియనటువంటి వారి ని ప్రజా పద్మ పురస్కారాల కోసం నామనిర్దేశం చేయవలసిందంటూ ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.  నామినేశన్ లను సెప్టెంబర్ 15 వరకు సమర్పించవచ్చు.
 

‘‘భారతదేశం లో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు.  వారు క్షేత్ర స్థాయి లో ప్రశంసాయోగ్యమైనటువంటి కృషి ని చేస్తున్నారు.  చాలా సార్లు, వారి ని గురించి మనం కని విని ఎరుగం.  అటువంటి ప్రేరణమూర్తుల ను గురించి మీకు తెలుసా ?  వారి ని #PeoplesPadma కై మీరు నామనిర్దేశం చేయవచ్చును.  సెప్టెంబర్ 15 వరకు నామినేశన్ లను దాఖలు చేయవచ్చు.’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

***
 

 

 

***

DS/SH



(Release ID: 1734685) Visitor Counter : 115