ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మొత్తం 33.57 కోట్లు దాటిన కోవిడ్ టీకా డోసుల పంపిణీ


గత 24 గంటల్లో 48,786 కొత్త కేసులు, 4 రోజులుగా 50 వేల లోపే

చికిత్సలో ఉన్న కేసులు 5,23,257; మొత్తం కేసుల్లో 1.72% మాత్రమే

రోజువారీ పాజిటివిటీ 2.54%; 24 రోజులుగా 5% లోపే

Posted On: 01 JUL 2021 10:16AM by PIB Hyderabad

భారత దేశపు మొత్తం కోవిడ్ టీకా డోసుల పంపిణీ నిన్నటికి 33.57 కోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం

ప్రకారం 44,75,791 శిబిరాల ద్వారా   33,57,16,019 డోసుల పంపిణీ జరిగింది. గత 24 గంటల్లో 27,60,345 టీకాలిచ్చారు.

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,02,12,078

రెండో డోస్

72,56,031

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,75,12,765

రెండో డోస్

95,16,814

18-44 వయోవర్గం

మొదటి డోస్

9,16,00,418

రెండో డోస్

21,82,234

45-59 వయోవర్గం

మొదటి డోస్

8,86,47,056

రెండో డోస్

1,63,14,943

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

6,81,27,563

రెండో డోస్

2,43,46,117

మొత్తం

33,57,16,019

 

సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు

చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  48,786 కొత్త కరోనా కేసులు

నమోదయ్యాయి. ఆ విధంగా రోజుకు 50 వేల లోపు కేసులు రావటం గత 4 రోజులుగా నడుస్తోంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి

 కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001YK2W.jpg

చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కూడా కనబడుతోంది. ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 5,23,257 మంది. చికిత్సలో

ఉన్నవారు నికరంగా 13,807 మంది గత 24 గంటల్లోనే తగ్గగా చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 1.72% మాత్రమే.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002C2IE.jpg 

కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 49 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. గత 24

గంటలలో  61,588 మంది కోలుకున్నారు.  అంతకు ముందురోజు కంటే 12,802మంది అదనంగా కోలుకున్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0038FIS.jpg 

ఇప్పటివరకూ కోవిడ్ బారిని పడి కోలుకున్నవారు 2,94,88,918 మంది కాగా గత 24 గంటలలో 61,588 మంది కోలుకున్నారు.

దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి శాతం 96.97% కు పెరిగింది.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004LU8R.jpg

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 19,21,450 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన

మొత్తం పరీక్షలు 41.20 కోట్లకు పైగా (41,20,21,494) అయ్యాయి. ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ

తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  2.64% కాగా రోజువారీ పాజిటివిటీ  2.54%  అయింది. వరుసగా 24 రోజులుగా

ఇది 5% లోపే ఉంటోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0050C9J.jpg



(Release ID: 1731812) Visitor Counter : 204