ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ కె.వి. సంపత్ కుమార్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 30 JUN 2021 6:40PM by PIB Hyderabad

సంస్కృత దినపత్రిక సుధర్మ సంపాదకుడు శ్రీ కె.వి. సంపత్ కుమార్ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ‘‘శ్రీ కె.వి. సంపత్ కుమార్ గారు ఒక ప్రేరణాత్మకమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. సంస్కృతాన్ని పరిరక్షించడం లోను, ఆ భాష
లోకప్రియత్వాన్ని సంపాదించుకొనేటట్లు- ప్రత్యేకించి యువత లో- ఆదరణ పొందేటట్టు చేయడం లోను ఆయన అలుపెరుగక కృషి చేశారు.  ఆయన లోని తీవ్ర ఉత్సాహం, దృఢ సంకల్పం స్ఫూర్తి ని అందించేటటువంటివి. ఆయన కుటుంబానికి, ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.



(Release ID: 1731804) Visitor Counter : 144