ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

29కోట్ల డోసుల మైలురాయి దాటిన టీకాల పంపిణీ గత 24 గంటలలో 50,848 కొత్త కరోనా కేసులు


చికిత్స్ ఉన్నవారి సంఖ్య 6,43,194 కు తగ్గుదల, 82 రోజుల అత్యల్పం

41 రోజులుగా కొత్తకేసులకంటే కోలుకున్నవారే అధికం
కోలుకున్నవారి శాతం 96.56% కు పెరుగుదల
రోజువారీ పాజిటివిటీ 2.67%, 16 రోజులుగా 5% లోపే

Posted On: 23 JUN 2021 11:06AM by PIB Hyderabad

టీకాల కార్యక్రమంలో భారత్ మరో మైలరాయి దాటింది.  నిన్నటికి 29 కోట్ల డోసుల టీకాలు పూర్తి చేసుకుంది. ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం 39,49,630 శిబిరాల ద్వారా మొత్త  29,46,39,511 టీకా డోసుల ఒఅంపిణీ జరగగాఅ గత 24 గంటలలో  54,24,374 టీకాలిచ్చారు.  ఆ వివరాలు ఇలా ఉన్నాయి

 

అరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,01,45,382

రెండో డోస్

71,14,021

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,72,70,889

రెండో డోస్

91,37,511

18-44 వయోవర్గం

మొదటి డోస్

6,59,41,855

రెండో డోస్

14,28,117

45-59 వయోవర్గం 

మొదటి డోస్

8,28,91,130

రెండో డోస్

1,31,57,562

60 పైబడ్డవారు

మొదటి డోస్

6,56,45,248

రెండో డోస్

2,19,07,796

మొత్తం

29,46,39,511

 

సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది.

గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  50,848 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

ఆ విధంగా రోజుకు లక్ష లోపు కేసులు రావటం గత 16 రోజులుగా నడుస్తోంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల్ ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0016AIA.jpg

చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కూడా కనబడుతోంది. ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 6,43,194 మంది కాగా ఇది గత 82 రోజుల అత్యల్పం.

చికిత్సలో ఉన్నవారు నికరంగా 19,327 మంది గత 24 గంటల్లోనే తగ్గగా చికిత్సలో ఉన్న్ అకేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 2.14% మాత్రమే కావటం గమనార్హం

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020R17.jpg

ఎక్కువమంది కోవిడ్ బారినుంచి బైటపడుతున్న కొద్దీ దేశపు కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 41 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. గత 24 గంటలలో  68,817 మంది కోలుకున్నారు.  అంతకు ముందురోజుకంటే దాదాపు 18,000(17,969) అదనంగా కోలుకున్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003YGJZ.jpg

ఇప్పటివరకూ కోవిడ్ బారిని పడి కోలుకున్నవారు 2,89,94,855 మంది కాగా గత 24 గంటలలో 68,817 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి శాతం 96.56% కు పెరిగింది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004G02Z.jpg

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 19,01,056 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 39.59కోట్లకు పైగా (39,59,73,198) అయ్యాయి.

ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  3.12% కాగా రోజువారీ పాజిటివిటీ  2.67%  అయింది. వరుసగా 15 రోజులుగా ఇది 5% లోపే ఉంటోంది.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005HEAM.jpg

****



(Release ID: 1729753) Visitor Counter : 202