ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రసిద్ధ కన్నడ రచయిత డాక్టర్ సిద్దలింగయ్య మృతికి ప్రధానమంత్రి సంతాపం
Posted On:
11 JUN 2021 8:22PM by PIB Hyderabad
ప్రసిద్ధ కన్నడ రచయిత డాక్టర్ సిద్దలింగయ్య కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా సందేశమిస్తూ- “విశిష్ట రచనలు, పద్యకవితలతోపాటు సామాజిక న్యాయం దిశగా డాక్టర్ సిద్దలింగయ్య చేసిన కృషి చిరకాలం గుర్తుండిపోతాయి. ఆయన మరణం నాకెంతో విచారం కలిగింది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను... ఓం శాంతి” అని ప్రధాని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1726410)
Visitor Counter : 126
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada