ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 టీకాల తాజా సమాచారం


రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటిదాకా 25.60 కోట్లకు పైగా టీకా డోసులు;

రాష్ట్రాల దగ్గర పంపిణీకి సిద్ధంగా ఇంకా 1.17 కోట్ల డోసులు

Posted On: 11 JUN 2021 11:22AM by PIB Hyderabad

భారత ప్రభుత్వం దేశవ్యాప్త టీకాల కార్యక్రమానికి అండగా ఉండి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు టీకా డోసులు ఉచితంగా అందిస్తూ వస్తోంది. కోవిడ్ మీద పోరులో భాగంగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాధి నిర్థారణ పరీక్షలు, సోకినవారీ ఆచూకీ కనిపెట్టటం, తగిన చికిత్స   అందించటం, వ్యాప్తి నివారణకు తగిన జాగ్రత్తలు పాటింపజేయటం, టీకాలివ్వటం అనే ఐదు అంశాల ప్రాధాన్యంలో భాగంగా  టీకాల మీద  ప్రత్యేక దృష్టిసారించింది.  ప్రైవేట్ ఆస్పత్రులు నేరుగా కొనుగోలు చేసేందుకు కూడా అవకాశమిచ్చింది.

మూడో దశ టీకాల కార్యక్రమాన్ని మరింత సరళంగా, వేగంగా అమలు చేయటం మే 1న మొదలైంది. ఈ వ్యూహంలో భాగంగా ప్రతి నెలలో సెంట్రల్ డ్రగ్స్ లేబరేటరీ (సిడిఎల్)  ఆమోదించిన ఉత్పత్తి సంస్థలలో తయారైన టీకామందు మునుపటిలాగానే రాష్టాలకు ఉచితంగా పంపిణీ జరుగుతుంది

భారత ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్ట్రాలకు, కేంద్రపాలితప్రాంతాలకు  25.60  కోట్లకు పైగా (25,60,08,080)  కోవిడ్ డోసులు ఉచితంగా అందజేసింది. ఇందులో రాష్ట్రాల వాడకం, వృధా కలిపి ఈ ఉదయం 8 గంటలవరకు అందిన సమాచారాన్ని బట్టి 24,44,06,096 డోసులు ఉన్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల దగ్గర ఇంకా 1.17 కోట్లకు  పైగా (1,17,56,911)టీకా డోసులు పంపిణీకి అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా,  వచ్చే మూడు రోజులలో 38 లక్షలకు పైగా ( 38,21,170) డోసులు రాష్ట్రాలకు అందుతాయి.

****



(Release ID: 1726227) Visitor Counter : 142