ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ బుద్ధదేబ్ దాస్ గుప్త కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 10 JUN 2021 11:28AM by PIB Hyderabad

చలనచిత్ర దర్శకుడు, మేధావి, కవి శ్రీ బుద్ధదేబ్ దాస్ గుప్త కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం  చేశారు.

‘‘శ్రీ బుద్ధదేబ్ దాస్ గుప్త మరణ వార్త దు:ఖాన్ని కలిగించింది.  ఆయన విభిన్న కృతులు సమాజం లోని అన్ని వర్గాల హృద‌య తంత్రుల ను స్పర్శించాయి.  ఆయన ప్రముఖ మేధావి, కవి కూడాను.  ఈ బాధాకరమైనటువంటి ఘడియ లో, ఆయన కుటుంబానికి, ఆయనను అభిమానించే వారికి కలిగిన దు:ఖం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి.’’ అని శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.



*******

DS



(Release ID: 1725937) Visitor Counter : 148