రైల్వే మంత్రిత్వ శాఖ

ఒకేరోజున రికార్డు స్థాయిలో దేశానికి 1195 ఎంటీల ఆక్సిజన్ అందించిన రైల్వేలు


గత రికార్డుగా ఉన్న 1142 ఎంటీల రికార్డును అధిగమించిన రైల్వేలు

అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొని తూర్పు నుంచి అత్యవసర ఆక్సిజన్ ను ఆంధ్రప్రదేశ్, సికింద్రాబాద్, తమిళనాడుకు రవాణా చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు

ఇంతవరకు దేశానికి 18980 ఎంటీలకు పైగా ఆక్సిజన్ రవాణా చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు

ఢిల్లీకి 5000 ఎంటీలకు మించి అందిన ఆక్సిజన్

15 రాష్ట్రాలకు 1141 ట్యాంకర్లలో ఆక్సిజన్ తరలించి ప్రయాణాన్ని ముగించిన 284 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు

ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ మరియు అస్సాం రాష్ట్రాలకు ఆక్సిజన్ తరలించి సహాయం అందించిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు


మహారాష్ట్రకు 614 మెట్రిక్ టన్నులు , యూపీకి దాదాపు 3731 మెట్రిక్ టన్నులు, ఎంపీకి 656 మెట్రిక్ టన్నులు, ఢిల్లీకి 5077 మెట్రిక్ టన్నులు, హర్యానాకు 1967 మెట్రిక్ టన్నులు, రాజస్థాన్‌కు 98 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 1653 మెట్రిక్ టన్నులు, ఉత్తరాఖండ్‌కు 320 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 1550 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 1190

Posted On: 27 MAY 2021 3:01PM by PIB Hyderabad

అడ్డంకులను అధిగమిస్తూ నూతన పరిష్కారాల మార్గాల ద్వారా  భారతీయ రైల్వేలు  దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) ను పంపిణీ చేయడం ద్వారా ఉపశమనం కలిగించే ప్రయాణాన్నికొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు భారత రైల్వే 1141 ట్యాంకర్లలో దాదాపు 18980  మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓను దేశంలోని వివిధ రాష్ట్రాలకు రవాణా  చేసింది.

వివిధ రాష్ట్రాలకు ఉపశమనం కలిగిస్తూ 284 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పటివరకు తమ ప్రయాణాన్ని పూర్తి చేశాయి. 

ఈ ప్రకటన వెలువడే సమయానికి 20 ట్యాంకర్లలో 392 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తో నాలుగు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ గమ్యస్థానాలకు పరుగులు తీస్తున్నాయి. 

ఆక్సిజన్ రవాణాలో 2021 మే 23వ తేదీన 1142 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను రవాణా చేసి నెలకొల్పిన రికార్డును భారత రైల్వేలు అధిగమించాయి. ఒకేరోజున 1195మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసి రైల్వేలు సరికొత్త రికార్డును నెలకొల్పాయి. 

ఢిల్లీకి 5000 మేట్రిల్ టన్నులకు పైగా ఎల్‌ఎంఓ సరఫరా అయ్యింది. 

దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు 1000 మెట్రిక్ టన్నులకు పైగా ఎల్‌ఎంఓ విడివిడిగా సరఫరా అయ్యింది.  

33 రోజుల కిందట దేశంలో తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌  పట్టాలు ఎక్కింది. మహారాష్ట్రకు 126 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రవాణాతో దేశంలో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ ల ప్రయాణం ప్రారంభమయ్యింది. 

అభ్యర్థించే రాష్ట్రాలకు సాధ్యమైనంత తక్కువ సమయంలో సాధ్యమైనంత ఎక్కువగా ఎల్‌ఎంఓను అందించడానికి భారత రైల్వే ప్రయత్నిస్తోంది.

ఆక్సిజన్ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్,  జార్ఖండ్, అస్సాం  రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా అయ్యింది . 

తాజా సమాచారం మేరకు మహారాష్ట్రకు 614 మెట్రిక్ టన్నులు యూపీకి దాదాపు 3731 మెట్రిక్ టన్నులుఎంపీకి 656 మెట్రిక్ టన్నులుఢిల్లీకి 5077 మెట్రిక్ టన్నులుహర్యానాకు 1967 మెట్రిక్ టన్నులురాజస్థాన్‌కు 98 మెట్రిక్ టన్నులుకర్ణాటకకు1653 మెట్రిక్ టన్నులుఉత్తరాఖండ్‌కు 320 మెట్రిక్ టన్నులుతమిళనాడుకు 1550 మెట్రిక్ టన్నులుఆంధ్రప్రదేశ్‌కు 1190 మెట్రిక్ టన్నులుపంజాబ్‌కు 225 మెట్రిక్ టన్నులు, కేరళకు 390 మెట్రిక్ టన్నులు, తెలంగాణకు 1312 మెట్రిక్ టన్నులు,ఝార్ఖండ్ కు 38 మెట్రిక్ టన్నులు, అస్సాంకు 160 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు రవాణా చేశాయి. 

ఆక్సిజన్ సరఫరా చేయవలసి ఉన్న వేర్వేరు మార్గాలను రైల్వేలు సిద్ధంచేశాయి. రాష్ట్రాల నుంచి అభ్యర్ధనలు అందిన వెంటనే రంగంలోకి దిగడానికి రైల్వేలు సిద్ధంగా ఉంటున్నాయి.  ఎల్‌ఎంఓను తీసుకురావడానికి రాష్ట్రాలు భారత రైల్వేకు ట్యాంకర్లను అందిస్తున్నాయి.

భారతీయ రైల్వే పశ్చిమంలోని హపా, బరోడా, ముంద్రా మరియు తూర్పున రూర్కెలా, దుర్గాపూర్, టాటానగర్, అంగుల్ వంటి ప్రదేశాల నుంచి  ఆక్సిజన్ ను సమగ్ర కార్యాచణతో   ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ,  ఉత్తర ప్రదేశ్ , అస్సాం రాష్ట్రాలకు రవాణా  చేస్తోంది.

ఆక్సిజన్ సాధ్యమైనంత వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేలా చూసేందుకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రవాణా  రైళ్లను నడపడంలో రైల్వే కొత్త ప్రమాణాలను, ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించింది. దూర ప్రాంతాలకు ప్రయాణిస్తున్న ఈ రైళ్లు ఒకోసారి 55 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి.  సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో ఆక్సిజన్ గమ్య స్థానానికి చేరుకునేలా చూడడానికి గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేసిన రైల్వేశాఖ వివిధ జోన్ల మధ్య సమన్వయం సాధిస్తూ  ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లను అత్యవసర ప్రాతిపదికన నడుపుతోంది . వివిధ విభాగాలపై సిబ్బంది మార్పుల కోసం సాంకేతిక స్టాప్‌లను 1 నిమిషానికి తగ్గించారు.

ఎలాంటి అంతరాయం లేకుండా  ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ ప్రయాణాన్ని కొనసాగించడానికి తమ మార్గాలను సిద్ధం చేస్తున్న రైల్వేలు   ఇతర సరకుల రవాణాకు అంతరాయం లేకుండా చర్యలను అమలు చేస్తున్నాయి. 

ఆక్సిజన్‌ను తరలించడం చాలా క్లిష్టమైన అంశం. ఈ గణాంకాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.  మరికొన్ని ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు రాత్రి తరువాత వాటి ప్రయాణాలను ప్రారంభిస్తాయని భావిస్తున్నారు.  

 

***



(Release ID: 1722197) Visitor Counter : 229