రైల్వే మంత్రిత్వ శాఖ

ప్రతికూల వాతావరణం, తుపాను మధ్య తూర్పు రాష్ట్రాల నుంచి 969 ఎంటీల ఎల్ఎంఓ తో బయలుదేరిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు


ఈ 12 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లలో తమిళనాడుకు 3,ఆంధ్రప్రదేశ్ కు 4, ఢిల్లీ ప్రాంతం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, కేరళకు ఒకో రైలు కేటాయింపు

ఇంతవరకు దేశానికి 17835 ఎంటీల ఆక్సిజన్ అందించిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు

జార్ఖండ్ చేరిన తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ : ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ సేవలు పొందిన 15వ రాష్ట్రంగా జార్ఖండ్

15 రాష్ట్రాలకు సహాయం అందించి ప్రయాణం ముగించిన 15 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు

ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ మరియు అస్సాం రాష్ట్రాలకు ఆక్సిజన్ తరలించి సహాయం అందించిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు

మహారాష్ట్రకు 614 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, యూపీకి దాదాపు 3731 మెట్రిక్ టన్నులు, ఎంపీకి 633 మెట్రిక్ టన్నులు, ఢిల్లీకి 4910 మెట్రిక్ టన్నులు, హర్యానాకు 1911 మెట్రిక్ టన్నులు, రాజస్థాన్‌కు 98 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు1653 మెట్రిక్ టన్నులు, ఉత్తరాఖండ్‌కు 320 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 1158 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 929 మెట్రిక్ టన్నులు, పంజాబ్‌కు 225 మె

Posted On: 26 MAY 2021 1:45PM by PIB Hyderabad

అన్ని అడ్డంకులను అధిగమించి కొత్త పరిష్కారాలను కనుగొనే భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) ను పంపిణీ చేయడం ద్వారా ఉపశమనం కలిగించే ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు భారత రైల్వే 1080 ట్యాంకర్లలో దాదాపు 17945  మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓను దేశంలోని వివిధ రాష్ట్రాలకు రవాణా  చేసింది.

వివిధ రాష్ట్రాలకు ఉపశమనం కలిగిస్తూ 272 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పటివరకు తమ ప్రయాణాన్ని పూర్తి చేశాయి. 

నిన్న రాత్రి చివరి వరకు  12 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు 969 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓతో తుఫాను ప్రభావానికి గురైన  తూర్పు రాష్ట్రాల నుంచి ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్యవివిధ రాష్ట్రాలకు  ఉపశమనం కలిగించడానికి బయలుదేరాయి. ఈ 12 రైళ్లల్లో మూడు రైళ్లు తమిళనాడు, నాలుగు రైళ్లు ఆంధ్రప్రదేశ్ కు,  ఢిల్లీ ప్రాంతం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, కేరళకు ఒకో రైలుచేరనున్నాయి. 

దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడుకర్ణాటకతెలంగాణలకు 1000 మెట్రిక్ టన్నులకు పైగా ఎల్‌ఎంఓ పంపిణీ ఒక్కొక్కటి దాటింది.

మొదటి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌  జార్ఖండ్ చేరుకుంది. రైల్వేల నుండి ఆక్సిజన్ పొందిన 15 వ రాష్ట్రంగా జార్ఖండ్ నిలిచింది.

అభ్యర్థించే రాష్ట్రాలకు సాధ్యమైనంత తక్కువ సమయంలో సాధ్యమైనంత ఎల్‌ఎంఓను అందించడానికి భారత రైల్వే ప్రయత్నిస్తోంది.

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆక్సిజన్  ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్,  జార్ఖండ్, అస్సాం  13 రాష్ట్రాలకు సరఫరా అయ్యింది. 

ఈ ప్రకటన వెలువడే సమయానికి  మహారాష్ట్రకు 614 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, యూపీకి దాదాపు 3731 మెట్రిక్ టన్నులు, ఎంపీకి 633 మెట్రిక్ టన్నులు, ఢిల్లీకి 4910 మెట్రిక్ టన్నులు, హర్యానాకు 1911 మెట్రిక్ టన్నులు, రాజస్థాన్‌కు 98 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు1653 మెట్రిక్ టన్నులు, ఉత్తరాఖండ్‌కు 320 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 1158 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 929 మెట్రిక్ టన్నులు, పంజాబ్‌కు 225 మెట్రిక్ టన్నులు, కేరళకు 246 మెట్రిక్ టన్నులు, తెలంగాణకు 1312 మెట్రిక్ టన్నులు, జార్ఖండ్ కు 38, అస్సాంకు 160 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అయ్యింది. 

ఆక్సిజన్ సరఫరా చేయవలసి ఉన్న వేర్వేరు మార్గాలను రైల్వేలు సిద్ధంచేశాయి. రాష్ట్రాల నుంచి అభ్యర్ధనలు అందిన వెంటనే రంగంలోకి దిగడానికి రైల్వేలు సిద్ధంగా ఉంటున్నాయి.  ఎల్‌ఎంఓను తీసుకురావడానికి రాష్ట్రాలు భారత రైల్వేకు ట్యాంకర్లను అందిస్తాయి.

భారతీయ రైల్వే పశ్చిమంలోని హపా, బరోడా, ముంద్రా మరియు తూర్పున రూర్కెలా, దుర్గాపూర్, టాటానగర్, అంగుల్ వంటి ప్రదేశాల నుంచి  ఆక్సిజన్ ను సమగ్ర కార్యాచణతో   ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ మరియు  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు రవాణ చేస్తోంది.

ఆక్సిజన్ సాధ్యమైనంత వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేలా చూసేందుకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రవాణా  రైళ్లను నడపడంలో రైల్వే కొత్త ప్రమాణాలను, ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించింది. దూర ప్రాంతాలకు ప్రయాణిస్తున్న ఈ రైళ్లు ఒకోసారి 55 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి.  సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో ఆక్సిజన్ గమ్య స్థానానికి చేరుకునేలా చూడడానికి గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేసిన రైల్వేశాఖ వివిధ జోన్ల మధ్య సమన్వయం సాధిస్తూ  ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లను అత్యవసర ప్రాతిపదికన నడుపుతోంది . వివిధ విభాగాలపై సిబ్బంది మార్పుల కోసం సాంకేతిక స్టాప్‌లను 1 నిమిషానికి తగ్గించారు.

ఎలాంటి అంతరాయం లేకుండా  ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ ప్రయాణాన్ని కొనసాగించడానికి రైల్వేలు తమ మార్గాలను సిద్ధం చేస్తూ ఇతర సరకుల రవాణాకు అంతరాయం లేకుండా చర్యలను అమలు చేస్తున్నాయి. 

ఆక్సిజన్‌ను తరలించడం చాలా క్లిష్టమైన అంశం. ఈ గణాంకాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.  మరికొన్ని ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు రాత్రి తరువాత వాటి ప్రయాణాలను ప్రారంభిస్తాయని భావిస్తున్నారు.  

***



(Release ID: 1721888) Visitor Counter : 224