ఆర్థిక మంత్రిత్వ శాఖ
"సామాజిక మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్ డిజిటల్ టెక్నాలజీల వాడకం"పై ఆర్థిక వ్యవహారాల శాఖ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ల సంయుక్తంగా వర్చువల్ సెమినార్
Posted On:
11 MAY 2021 12:47PM by PIB Hyderabad
ఆర్ధిక శాఖ, ఆర్ధిక వ్యవహారాల శాఖ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సంయుక్తంగా "సామాజిక మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్ డిజిటల్ టెక్నాలజీల వాడకం"పై వర్చువల్ సెమినార్ను నిర్వహించనున్నాయి. ఇండియన్ బ్రిక్స్ చైర్షిప్ 2021, ఆర్థిక మరియు ఆర్థిక సహకార అజెండాలో భాగంగా ఈ నెల 13వ తేదీన (గురువారం) ఈ సెమినార్ను నిర్వహించనున్నారు. కోవిడ్-19 మహమ్మారి సామాజిక మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టడం యొక్క ప్రాముఖ్యతను బలోపేతం చేసింది. ఆధునిక మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో డిజిటల్ టెక్నాలజీలను పెంచే ప్రాముఖ్యతను కూడా ఇది నొక్కి చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా ఎదురవుతున్న సవాళ్లు అందరికీ, ముఖ్యంగా బ్రిక్స్ దేశాలకు ఒకే విధంగా ఉన్నాయి. సాంఘిక, ఆర్థిక, డిజిటల్ అభివృద్ధికి సంబంధించిన సాధారణ ప్రయోజనాలను మనం పంచుకునేందుకు మరియు ముందుకు సాగడానికి స్థిరమైన యంత్రాంగాన్ని నిర్మించడంలో గొప్ప సామర్థ్యం కలిగి ఉంది. ఈ సదస్సు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల నుండి ఉన్నత స్థాయి వారు పాల్గొననున్నారు. 21 వ శతాబ్దంలో సామాజిక మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్, డిజిటల్ టెక్నాలజీల వాడకం చుట్టూ ఉన్న ముఖ్య సమస్యలపై దృష్టి సారిస్తుంది. ఈ సమావేశంలో పలు ప్యానెల్ చర్చలు, రెండు థిమాటిక్ సెషన్లలో భాగంగా వివిధ అంశాలపై పలు రకాల సమాలోచనలు జరపనున్నారు. సాంఘిక మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టడం యొక్క ప్రాముఖ్యత వంటివి, సామాజిక మౌలిక సదుపాయాలకు సంబంధించి సవాళ్లను ఎదుర్కోవటానికి స్థిరమైన అభివృద్ధి దశలను ప్రోత్సహించడం, ప్రైవేటు రంగాల భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రాజెక్టులను డి-రిస్క్ చేయడానికి ఫైనాన్సింగ్ మార్గాలు, ఆరోగ్యాన్ని బట్వాడా చేయడానికి డిజిటల్ టెక్నాలజీని సామాజిక మౌలిక సదుపాయాలతో అనుసంధానించడం యొక్క విలువ కోవిడ్-19 తరువాత విద్య విషయంలో రికవరీ, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరపే అవకాశం ఉంది. బ్రిక్స్ దేశాలలో సామాజిక మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడానికి ఆచరణీయ నమూనాలు, సాధనాల పరిధిని కూడా ఇందులో అన్వేషించనున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శ్రీ అజయ్ సేథ్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఆ తరువాత ఎన్డీబీ అధ్యక్షుడు మిస్టర్ మార్కోస్ ట్రాయ్జో ప్రసంగించనున్నారు. కొలంబియా విశ్వవిద్యాలయపు సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ జెఫ్రీ డి.సాచ్స్ ఈ సమావేశంలో కీలకోపన్యాసం చేయనున్నారు.
****
(Release ID: 1717818)
Visitor Counter : 206