ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ సాంకేతిక విజ్ఞాన దినం నాడు శాస్త్రవేత్తల కు నమస్కరించిన ప్రధాన మంత్రి

Posted On: 11 MAY 2021 11:49AM by PIB Hyderabad

జాతీయ సాంకేతిక విజ్ఞాన దినం సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శాస్త్రజ్ఞుల ను, సాంకేతిక విజ్ఞానం పట్ల వారికి గల ఉద్వేగాన్ని ప్రశంసించారు.    
 
‘‘జాతీయ సాంకేతిక విజ్ఞాన దినం నాడు, మనం మన శాస్త్రవేత్త ల కఠోర శ్రమ కు, వారి గట్టి పట్టుదల కు, అలాగే సాంకేతిక విజ్ఞానం పట్ల వారి మక్కువ కు వందనమాచరిద్దాం.  1998వ సంవత్సరం లో జరిగిన పోఖ్ రణ్ పరీక్షలు భారతదేశ విజ్ఞానశాస్త్ర, సాంకేతిక విజ్ఞాన సంబంధి సత్తా ను చాటడాన్ని మనం గర్వంగా గుర్తుకు తెచ్చుకొందాం.

ఎలాంటి సవాలు తో నిండినటువంటి స్థితి లో అయినా, మన శాస్త్రవేత్తలు, నూతన ఆవిష్కర్త లు సందర్భానికి తగినట్లు గా ప్రతిస్పందించి, మరి సవాలు ను శమింపచేయడం కోసం కృషి చేశారు.  గత ఏడాది కాలానికి పైగా, వారు కోవిడ్-19 తో పోరాడడానికి కష్టపడి పనిచేశారు. వారి స్ఫూర్తి ని, అసాధారణమైనటువంటి ఉత్సుకత ను నేను అభినందిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో పేర్కొన్నారు.

 

****

DS



(Release ID: 1717656) Visitor Counter : 197