రైల్వే మంత్రిత్వ శాఖ

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కోవిడ్ సంరక్షణ కేంద్రాలుగా బోగీలను సమీకరించిన రైల్వేలు జబల్పూర్ లో ఐసొలేషన్ బోగీల ఏర్పాటు


నంద్రుబార్ నుంచి పాల్ఘర్‌కు ఐసోలేషన్ బోగీల తరలింపు


దేశం వివిధ ప్రాంతాల్లో అందుబాటులో 191 ఐసొలేషన్ బోగీలు

ఐసొలేషన్ బోగీలలో అందుబాటులో 2929 పడకలు

రాష్ట్రాల్లో వినియోగం కోసం 64000 పడకలను సిద్ధం చేస్తున్న రైల్వేలు

పరిశుభ్రత, ఆహారంపై రోగుల నుంచి సానుకూల స్పందన

Posted On: 01 MAY 2021 3:06PM by PIB Hyderabad

కోవిడ్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ఐక్య పోరాటంలో దేశ సామర్థ్యాలను బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా  రైల్వే మంత్రిత్వ శాఖ దాదాపు 64000 పడకలతో దాదాపు 4000 ఐసోలేషన్ బోగీలను సిద్ధం చేసింది. 

రాష్ట్రాలతో కలసి పనిచేసి సాధ్యమైనంత త్వరగా సహాయ కార్యక్రమాలను చేపట్టడానికి రైల్వేలు వికేంద్రీకృత కార్యాచరణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా అవగాహన కుదుర్చుకోవడానికి జోనల్, డివిజన్ స్థాయి అధికారులకు రైల్వేలు అధికారం ఇచ్చాయి. ఈ ఐసొలేషన్ బోగీలను అవసరమైన ప్రాంతాలకు సులువుగా వేగంగా తరలించడానికి అవకాశం ఉంటుంది. 

ఇంతవరకు, రాష్ట్రాల నుంచి అందిన అభ్యర్ధనలు మేరకు 2990 పడకలు కలిగిన 191 బోగీలను వివిధ రాష్ట్రాలకు తరలించారు. ఐసోలేషన్ బోగీలను  ప్రస్తుతం న్యూఢిల్లీ,  మహారాష్ట్ర (అజ్ని ఐసిడి, నంద్రుబార్), మధ్యప్రదేశ్ (ఇండోర్ సమీపంలోని టిహి) ఉపయోగిస్తున్నారు. 

ఫైజాబాద్, భడోహి, వారణాసి, బరేలి & నజీబాబాద్ వంటి ఉత్తర ప్రదేశ్ లోని ప్రధాన నగరాల్లో రైల్వే 50 బోగీలను ఉంచింది.  జిల్లా అధికారుల డిమాండ్ మేరకు ఐసోలేషన్ కోచ్‌లను నన్‌రూబార్ నుంచి పాల్ఘర్‌కు తరలిస్తున్నారు.  జబల్పూర్ కోసం ఐసోలేషన్ కోచ్లను కూడా మోహరిస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్ లోని ప్రధాన నగరాలైన ఫైజాబాద్, భడోహి, వారణాసి, బరేలి నజీబాబాద్ లలో  రైల్వే 50 బోగీలను ఉంచింది.  జిల్లా అధికారుల సూచన మేరకు ఐసోలేషన్ బోగీలను  నన్‌రూబార్ నుంచి పాల్ఘర్‌కు తరలిస్తున్నారు.  జబల్పూర్ లో కూడా  ఐసోలేషన్ బోగీలను ఏర్పాటు చేస్తున్నారు. 

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ఐసొలేషన్ బోగీల వినియోగంపై తాజా సమాచారం ఇలా ఉంది.

 నంద్రుబార్ (మహారాష్ట్ర)లో  గత రెండు రోజులలో ఆరుగురు రోగులు చేరారు. ఐసొలేషన్ తరువాత  10 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు.  43 మంది కోవిడ్ రోగులు ప్రస్తుతం ఈ సదుపాయాన్ని ఉపయోగిస్తున్నారు.  మొత్తం మీద రాష్ట్ర ఆరోగ్య అధికారులు 57 మంది రోగులను డిశ్చార్జ్ చేసి, 92 మందిని  కొత్తగా చేరుకున్నారు.  వీటిలో 314 పడకలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.

న్యూఢిల్లీలో  1200 పడకల సామర్థ్యం కలిగిన 75 కోవిడ్ కేర్ బోగీలను ప్రభుత్వానికి రైల్వే అందించింది. వీటిలో  50 బోగీలను శకుర్‌బస్తి వద్ద, 25 బోగీలను ఆనంద్ విహార్ స్టేషన్లలో ఉంచారు. ఒక రోగి డిశ్చార్జ్ కాగా తేదీ నాటికి మరో నలుగురు చేరారు. వీటిలో  1196 పడకలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రం రెండు బోగీలను అందించాలని కోరింది. దీనికి స్పందించిన పశ్చిమ రైల్వేలో రత్లం డివిజన్ ఇండోర్ సమీపంలోని తిహి స్టేషన్‌లో 320 పడకల సామర్థ్యంతో 22 బోగీలను ఏర్పాటుచేసింది. వీటిలో ఆరుగురు రోగులు చేరారు. 

భోపాల్‌లో 20 బోగీలను మోహరిస్తున్నారు.  ఈ సదుపాయంలో, తాజా డేటా ప్రకారం 4 మంది రోగులతో 20 ప్రవేశాలు జరిగాయి.  ఈ సౌకర్యం వద్ద 276 పడకలు అందుబాటులో ఉన్నాయి. భోపాల్‌లో 20 బోగీలను ఏర్పాటు చేస్తున్నారు.  వీటిలో తాజా సమాచారం ప్రకారం  నలుగురు రోగులు  డిశ్చార్జ్ కాగా 20 మంది చేరారు.  ఈ సౌకర్యం వద్ద 276 పడకలు అందుబాటులో ఉన్నాయి.

రైల్వే ఏర్పాటుచేసిన ఈ సౌకర్యాల్లో తాజా రికార్డుల ప్రకారం, మొత్తం 62 మంది  డిశ్చార్జ్ కాగా కొత్తగా  123మంది చికిత్స కోసం చేరారు.  ప్రస్తుతం 61 మంది కోవిడ్ రోగులు ఐసోలేషన్ బోగీలను  ఉపయోగిస్తున్నారు.  వీటిలో  2929 పడకలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.

 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంతవరకు బోగీల కోసం అభ్యర్ధన అందలేదు. అయితే,  ఫైజాబాద్, భడోహి, వారణాసి, బరేలి, నజీబాబాద్‌లో  800 పడకల (50 బోగీలు) సామర్థ్యం గల బోగీలను సిద్ధం చేశారు. 

 

***



(Release ID: 1715424) Visitor Counter : 138