ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మరో మైలుయి దాటిన భారత్: 15 కోట్లు దాటిన టీకా డోసులు


గత 24 గంటల్లో 21 లక్షలకు పైగా టీకాలు

గడిచిన 24 గంటల్లో 2.69 లక్షలకు పైగా కోలుకున్న కోవిడ్ బాధితులు

కోవిడ్ బాధితులలో మృతులు 1.11 శాతానికి తగ్గుదల

గత 24 గంటల్లో ఒక్క మరణమూ నమోదు కాని ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు

Posted On: 29 APR 2021 10:46AM by PIB Hyderabad

కోవిడ్ మీద పొరులో భాగంగా భారత్ చేపట్టిన టీకాల కార్యక్రమం మరో మైలురాయి దాటింది. ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 15 కోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు మొత్తం 15,00,20,648 టీకా డోసులు పంపిణీ 22,07,065 శిబిరాల ద్వారా ఇచ్చింది. ఇందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన 93,67,520 మొదటి డోసులు, 61,47,918 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,23,19,903 మొదటి డోసులు, 66,12,789 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,14,99,834 మొదటి డోసులు, 98,92,380 రెండో డోసులు, 45-6- ఏళ్ళ మధ్యవారు తీసుకున్న 5,10,24,886 మొదటి డోసులు, 31,55,418 రెండో డోసులు ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళ మధ్యవారు

60 పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

93,67,520

61,47,918

1,23,19,903

66,12,789

5,10,24,886

31,55,418

5,14,99,834

98,92,380

15,00,20,648

 

దేశమంతటా ఇచ్చిన మొత్తం డోసులలో 67.18% వాటా పది రాష్ట్రాలదే.

 

గడిచిన 24 గంటలలో 21 లక్షలకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది. దేసవ్యాప్త టీకాల కార్యక్రమం మొదలైన 103 వ రోజైన ఏప్రిల్ 28 వతేదీన 21,93,281 టీకా డోసులు ఇచ్చారు.

అందులో 12,82,135 మంది లబ్ధిదారులకి 20,944 శిబిరాల ద్వారా మొదటి డోసులివ్వగా 9,11,146 మందికి రెండో డోస్ ఇచ్చారు.

 

 

తేదీ: ఏప్రిల్ 28, 2021 ( 103వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళవారు

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

19,745

41,681

97,928

86,411

7,50,305

2,27,966

4,14,157

5,55,088

12,82,135

9,11,146

 

భారతదేశంలో మొత్తం కోవిడ్ బారినుంచి కోలుకొని బైటపడినవారి సంఖ్య 1,50,86,878 కు చేరగా కోలుకున్నవారి శాతం

82.10% గా నమోదైంది. గత 24 గంటలలో 2,69,507 మంది కోలుకోగా వారిలో 78.07% మంది పది రాష్ట్రాల వారే ఉన్నారు..

https://ci3.googleusercontent.com/proxy/m8nWkUeCvoIcRN1wVAoALn95YcKwKy-OXoY4ChFfoIFLzECIrYQJDFMy4q7forkwqUS0yciw-Qw4jzCRGMdgJwexhpAKK3AZEC8OjDZiX-vPp5nBttEXfkvZZA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002P1VX.jpg

గత 24 గంటలలో 3,79,257 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. పది రాష్ట్రాలు – మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక,

కేరళ, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ లలో కొత్తకేసుల్లో 72.20% ఉన్నాయి. మహారాష్ట్రలో

అత్యధికంగా ఒక్క రోజులో 63,309 కేసులు రాగా కర్నాటకలో 39,047, కేరళలో 35,013 వచ్చాయి.

 

https://ci5.googleusercontent.com/proxy/5GQlDGdxGEtuEFUdwBEy7D4RgKIkY_JVxT58KqMYscRj_-HmyqVnGowib5Rhg3XQ3Zs8Rvj65ujgRnT_FNFqYsQo6nPPCQUdqrzikSTppoT5Sq2hlaheH3KI3w=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003OYS1.jpg

 

దేశంలో చికిత్సలో ఉన్న కేసులు 30,84,814 కు చేరగా ఇవి మొత్తం పాజిటివ్ కేసులలో 16.79%. గత 24 గంటలలో

చికిత్స పొందుతున్నవారి సంఖ్య నికరంగా 1,06,105 పెరిగింది. ఇందులో 11 రాష్ట్రాలవాటా 78.26% ఉంది.

 

https://ci6.googleusercontent.com/proxy/1iWc3oh8RFHVFQhVkwDF7EO9rtLAABSsd-0eCQJomELp0CsHz8N5nlYe1x2QW-DCBsjPXjZylST0Ht5eryxbljBxk5ZEnepMtd6b-nu8JaUHIooZo12Z81lwvQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004V59G.jpg

జాతీయ స్థాయిలో కోవిడ్ బాధితులలో మరణాల శాతం తగ్గుతూ ప్రస్తుతం 1.11% గా ఉంది. గడిచిన 24 గంటలలో

3,645 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇందులో 78.71% మంది పది రాష్టాలకు చెందినవారున్నారు. మహారాష్ట్రలో

అత్యధికంగా ఒక్క రోజులో 1,035 మరణాలు నమోదు కాగా ఢిల్లీలో 368 మంది చనిపోయారు.

https://ci5.googleusercontent.com/proxy/gY2Avyu_jzumPPmTMMLEdenB3pGG6Uon6RLn1pSIulUTqBUDapNU9F6SSKtn4GZl18yRFOqgLSGvjowkYoziRfwC_sFjrUyYllZn6M541UfGqMpyrcrKXcTxoQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00537OW.jpg

 

గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆరు ఉన్నాయి. అవి:

డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, లద్దాఖ్, లక్షదీవులు, మిజోరం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్.

 

****

 

 



(Release ID: 1714905) Visitor Counter : 236