సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సీనియర్ ఐఐఎస్ అధికారి మణికాంత్ ఠాకూర్ కరోనాతో కన్నుమూత
కరోనా పోరాడుతూ గతవారం తుదిశ్వాస విడిచిన మరో అధికారి నరేంద్ర కౌశల్ను కూడా స్మరించుకున్న ఐఐఎస్ సమాజం
Posted On:
25 APR 2021 2:02PM by PIB Hyderabad
సీనియర్ ఐఐఎస్ అధికారి మణికాంత్ ఠాకూర్, కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. దిల్లీలోని సఫ్దార్జంగ్ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో మీడియా విభాగం అధిపతిగా శ్రీ ఠాకూర్ సేవలు అందించారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ; బ్యూరో ఆఫ్ ఔట్రీచ్ &కమ్యూనికేషన్; ఆల్ ఇండియా రేడియో & దూరదర్శన్ వార్తల సేవల విభాగంలో వివిధ హోదాల్లో 30 ఏళ్లపాటు పని చేశారు. ఆల్ ఇండియా రేడియో & దూరదర్శన్ వార్తల విభాగంలో రిపోర్టింగ్ అధిపతి హోదాలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించారు.
శ్రీ మణికాంత్ ఠాకూర్ మరణం పట్ల కేంద్ర సమాచార, ప్రసార శాఖ; ఆల్ ఇండియా రేడియో & దూరదర్శన్ విభాగం; ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశాయి.
కరోనా పోరాడుతూ రిషికేష్ ఎయిమ్స్లో ఈ నెల 18వ తేదీన తుదిశ్వాస విడిచిన మరో ఐఐఎస్ అధికారి, ఉత్తరాఖండ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ నరేంద్ర కౌశల్ను కూడా ఐఐఎస్ సమాజం స్మరించుకుంది.
వృత్తిగత నైపుణ్యం, ప్రజాసేవ పట్ల అంకితభావంతో సేవలందించిన ఈ ఇద్దరు అధికారులు చిరస్మరణీయులు.
***
(Release ID: 1714075)
Visitor Counter : 132