ప్రధాన మంత్రి కార్యాలయం

కేంద్ర మాజీ మంత్రి శ్రీ దిగ్విజ‌య్ సింహ్ ఝాలా మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాన‌ మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 04 APR 2021 11:27AM by PIB Hyderabad

కేంద్ర మాజీ మంత్రి శ్రీ దిగ్విజ‌య్ సింహ్ ఝాలా మృతి పట్ల ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
 

‘‘కేంద్ర మాజీ మంత్రి శ్రీ దిగ్విజ‌య్‌ సింహ్ ఝాలా గారు మ‌ర‌ణించారని తెలిసి చాలా దు:ఖం కలిగింది.  గుజ‌రాత్ రాజ‌కీయాల‌లోను, జాతీయ‌ రాజ‌కీయాల‌లోను చురుకైన పాత్ర ను ఆయన పోషించారు. ఆయన చేసిన సాముదాయిక సేవ‌ కు, ప‌ర్యావ‌ర‌ణం ప‌ట్ల ఆయన కనబరచిన ప్రేమ‌ కు గాను ఆయన ను స్మరించుకోవడం జరుగుతుంది.  ఆయన కుటుంబానికి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 1709537) సందర్శకుల సూచీ సంఖ్య : : 223