ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్-19 టీకా కార్యక్రమం తాజా సమాచారం

దేశవ్యాపితంగా 15 లక్షలకు పైగా ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు

8వ రోజు సాయంకాలం 6 గంటల వరకు టీకా కార్యక్రమంలో 1,46,598 మందికి లభ్ది

0.0007% మంది మాత్రమే టీకా తీసుకున్న తరవాత అస్వస్థతో ఆసుపత్రిలో చేరిక

13 దేశాలలో భారత్ తరహాలో టీకాల కార్యక్రమంపై శిక్షణ

Posted On: 23 JAN 2021 7:31PM by PIB Hyderabad

కోవిడ్-19 నివారణకు దేశ వ్యాపితంగా ప్రారంభమైన టీకాల కార్యక్రమం ఎనిమిదవ రోజున కూడా విజయవంతంగా కొనసాగింది. కోవిడ్ 19 నివారణకు టీకాలు తీసుకున్న ఆరోగ్య కార్యకర్తల సంఖ్య ఈ రోజు 15 లక్షల సంఖ్యను దాటింది. ఈ రోజు సాయంకాలం ఆరు గంటల సమయానికి దేశవ్యాపితంగా 15,37,190 లబ్ధిదారులకు టీకాలను వేయడం జరిగింది. 27,776 సెషన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు సమాచారం. ఈ రోజు ఒక్కరోజే 3,368 సెషన్లను నిర్వహించారు. 

 టీకాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సాయంకాలం ఆరు గంటల సమయానికి 1,46,598 మంది టీకాలను వేయించుకున్నారు. ఈ రోజు రాత్రికి తుది నివేదికలు వస్తాయి. 

 

రాష్ట్రం / కేంద్రపాలితప్రాంతం    

టీకా లబ్ధిదారులు

1

అండమాన్, నికోబార్ దీవులు

530

2

ఆంధ్రప్రదేశ్

11,562

3

అరుణాచల్ ప్రదేశ్

525

4

బీహార్ 

12,165

5

చండీగఢ్ 

345

6

చత్తీస్ గఢ్ 

8,138

7

దాద్రా, నాగర్ హవేలి 

83

8

డామన్, డయ్యూ 

189

9

ఢిల్లీ 

6,111

10

గోవా 

615

11

గుజరాత్ 

22,063

12

హర్యానా 

9,188

13

హిమాచల్ ప్రదేశ్ 

3,935

14

జమ్మూ కశ్మీర్ 

1,820

15

 

కర్నాటక

3,669

16

కేరళ 

6,012

17

 లద్దాఖ్                                          

18

లక్షదీవులు

81

19

మహారాష్ట్ర 

21,751

 

20

మణిపూర్ 

396

 

                                  

 

 

21

మేఘాలయ   

 

158

 

 

22

మిజోరం 

322

23

ఒడిశా 

14,892

24

పుదుచ్చేరి 

381

25

పంజాబ్ 

8,968

26

రాజస్థాన్ 

7,900

27

తమిళనాదు 

4,642

 

 

 

 

   

                                                          మొత్తం

1,46,598

 

ఎనిమిదవ రోజు సాయంకాలం ఆరు గంటల వరకు 123 ఏఇఎఫ్ఐ లు నివేదికలు అందాయి. 

ఇంతవరకు 11 మంది ఆసుపత్రులలో చేరారు. టీకాలు తీసుకున్న వారిలో కేవలం 0.007% మంది మాత్రమే ఆసుపత్రిలో చేరారు. గత 24 గంటలలో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో మాత్రమే ఒకేఒక్క వ్యక్తి ఆసుపత్రిలో చేరారు. ఈ వ్యక్తి జనవరి 20వ తేదీన టీకా తీసుకున్నారు. 

టీకాలు తీసుకున్న తరువాత ఆరుమంది మరణించారు. గత 24 గంటలలో హర్యానా లోని గురుగ్రంలో నివసిస్తున్న 56 సంవత్సరాల వ్యక్తి మరణించారు.  అయితే, ఈ మృతికి టీకాకు సంబంధం లేదని ఆ వ్యక్తి గుండె సంబంధ సమస్యతో ప్రాణాలు కోల్పోయారని పోస్ట్ మార్టం నివేదిక తెలిపింది. అన్ని మరణాలకు కోవిడ్ 19 టీకాతో ముడిపెట్టడం జరుగుతోంది. 

టీకా కార్యక్రమాన్ని ప్రారంభించక ముందు దేశంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నిర్వహించిన కార్యక్రమాన్ని 13 విదేశాలు ( బహరైన్,బంగ్లాదేశ్, భూటాన్,బ్రెజిల్,మాల్దీవులు,మారిషస్,మంగోలియా,మొరాకో,మయాన్మార్,నేపాల్,ఒమాన్,సీషెల్స్ మరియు శ్రీలంక) అమలు చేస్తున్నాయి. 

12 రాష్ట్రాలకు అదనంగా వచ్చేవారం నుంచి ఛత్తీస్ ఘర్,గుజరాత్,ఝార్ఖండ్,కేరళ,మధ్యప్రదేశ్,పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు  కావాక్సీన్ ఇవ్వనున్నాయి. ఈ ఏడు రాష్ట్రాల అధికారులకు ఈ రోజు కార్యక్రమంపై ఐసిఎంఆర్, ఆరోగ్యకుటుంబ సంక్షేమశాఖలు అవగాహన కల్పించడం జరిగింది. 

***



(Release ID: 1691699) Visitor Counter : 171