సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
సవరించిన సీబీఐ 'క్రైమ్ మాన్యువల్'ను విడుదల చేసిన కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్
Posted On:
21 DEC 2020 6:49PM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డా.జితేంద్ర సింగ్, సవరించిన సీబీఐ 'క్రైమ్ మాన్యువల్'ను తన కార్యాలయంలో విడుదల చేశారు. సీబీఐ డైరెక్టర్ శ్రీ రిషి కుమార్ శుక్లా, సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చట్టం, దర్యాప్తు పద్ధతులు, విధానాల్లో తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, సీబీఐ 'క్రైమ్ మాన్యువల్'ను పదిహేనేళ్ల తర్వాత సరికొత్త మార్పులతో తీసుకొచ్చినందుకు సీబీఐ అధికారులను కేంద్ర మంత్రి అభినందించారు.
***
(Release ID: 1682555)
Visitor Counter : 167