ప్రధాన మంత్రి కార్యాలయం

నాగాలాండ్ ప్రజలకు ఆ రాష్ట్ర స్థాపన దినం సందర్బం లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 01 DEC 2020 9:33AM by PIB Hyderabad

నాగాలాండ్ స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ‘‘ నాగాలాండ్ కు చెందిన నా సోదరీమణులకు, నా సోదరులకు వారి రాష్ట్ర స్థాపన దినం నాడు ఇవే శుభకామన లు.  నాగాలాండ్ ప్రజలు వారి సాహసానికి, దయాళుత్వానికి గాను ప్రసిద్ధి ని పొందారు.  వారి సంస్కృతి ఆదర్శప్రాయమైనటువంటిది.  అలాగే, భారతదేశం ప్రగతి కి వారి తోడ్పాటు కూడా ఆదర్శప్రాయమైందే.  నాగాలాండ్ నిరంతరం అభివృద్ధి పథం లో మునుముందుకు సాగిపోతూ ఉండాలని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.   

   
***


(Release ID: 1677314) Visitor Counter : 215