ప్రధాన మంత్రి కార్యాలయం

తమిళనాడు ముఖ్యమంత్రితో సంభాషించిన - ప్రధానమంత్రి

తుఫాను బాధితుల కోసం ఎక్స్-గ్రేషియా ఆర్ధిక సహాయాన్ని ప్రకటించిన - ప్రధానమంత్రి

Posted On: 27 NOV 2020 9:59PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి తిరు ఎడప్పాడి కె. పళనిస్వామి తో మాట్లాడి, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.  రక్షణ, సహాయక చర్యలకు సహకరించడానికి కేంద్ర బృందాలను తమిళనాడుకు పంపుతున్నారు.

ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయినవారికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు.  గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.  ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, మరణించిన వ్యక్తులు ఒక్కరికీ రెండు లక్షల రూపాయల చొప్పున వారి సమీప బంధువులకు, అదేవిధంగా గాయపడినవారికి, ఒక్కొక్కరికి  50,000 రూపాయల చొప్పున,  ఎక్స్-గ్రేషియాగా, పి.ఎమ్.ఎన్.ఆర్.ఎఫ్. నుండి ఆర్ధిక సహాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు.

*****


(Release ID: 1676634) Visitor Counter : 109