వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వేగంగా సాగుతున్న ఖరీఫ్‌ వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ; ప్రస్తుతమున్న ఎంఎస్‌పీ పథకాల ప్రకారం ఎంఎస్‌పీ వద్ద రైతుల నుంచి పంటలు సేకరిస్తున్న కేంద్రం

పంజాబ్‌, హర్యానా రైతుల నుంచి, మూడు రోజుల్లో, రూ.84.6 కోట్ల విలువైన 44,809 మె.ట. ధాన్యం సేకరణ

Posted On: 30 SEP 2020 4:53PM by PIB Hyderabad

ప్రస్తుతమున్న కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ‌) పథకాల ప్రకారం, 2020-21 ఖరీఫ్‌ పంటలను రైతుల నుంచి కేంద్రం సేకరిస్తోంది.

    రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు, ప్రస్తుత సీజన్‌లో 14.09 ల.మె.ట. పప్పుధాన్యాలు, నూనె గింజల సేకరణకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానాకు అనుమతి లభించింది. మిగిలిన రాష్ట్రాలు/యూటీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వాటికి కూడా ఎఫ్‌ఏక్యూ రకాల సేకరణకు అనుమతి లభిస్తుంది. ఒకవేళ మార్కెట్‌ రేటు కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉంటే, మద్దతు ధర పథకాలను (పీఎస్‌ఎస్‌) అనుసరించి సేకరణ ఉంటుంది.

    ఈ నెల 29వ తేదీ వరకు, 48 మంది తమిళ రైతులకు ప్రయోజనం చేకూరుస్తూ, రూ.33 లక్షల కనీస మద్దతు ధరతో, 46.35 మె.ట. పెసలను నోడల్‌ ఏజెన్సీల ద్వారా కేంద్రం సేకరించింది. అదేవిధంగా, 5089 మె.ట. ఎండు కొబ్బరి చిప్పలను రూ.52.4 కోట్ల కనీస మద్దతు ధరతో సేకరించింది. తమిళనాడు, కర్ణాటకలోని 3961 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళలో మొత్తం 1.23 ల.మె.ట. ఎండు కొబ్బరిచిప్పల సేకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

    గత శనివారం నుంచి హర్యానా, పంజాబ్‌లో ఖరీఫ్‌ ధాన్యం సేకరణ ప్రారంభమైంది. క్వింటాలుకు రూ.1888 కనీస మద్దతు ధరతో, ఈ రెండు రాష్ట్రాల్లోని 2950 రైతుల నుంచి మంగళవారం వరకు మొత్తం 44,809 మె.ట. ధాన్యాన్ని కేంద్రం సేకరించింది. ఇందులో హర్యానా వాటా 3,506 మె.ట., పంజాబ్‌ వాటా 41,303 మె.ట. ధాన్యం విలువ రూ.84.6 కోట్లు. 

    ఈ ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో పత్తి సేకరణ అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఎఫ్‌ఏక్యూ రకం పత్తిని, కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అక్టోబర్‌ 1వ తేదీ నుంచి సేకరిస్తుంది.

***


(Release ID: 1660447)