బొగ్గు మంత్రిత్వ శాఖ

బొగ్గు గని వేలం: ఆఫ్‌లైన్/ భౌతిక బిడ్ల దాఖ‌లు

Posted On: 29 SEP 2020 5:10PM by PIB Hyderabad

సీఎం (ఎస్‌పీ) చట్టం-2015 కింద 11వ ట్రంచ్‌ వేలం, ఎంఎండీఆర్ చట్టం - 1957 కింద ఒక‌టో ట్రంచ్‌ వేలంలో భాగంగా.. మొత్తం 38 బొగ్గు గనుల వాణిజ్య మైనింగ్‌ వేలానికి గాను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ జూన్ 18, 2020న వేలం ప్రక్రియను ప్రారంభించింది. బిడ్ సమర్పణకు చివరి తేదీ 29.09.2020 [14.00 గంటల వరకు.]. 23 బొగ్గు గనులు / బ్లాకుల కోసం నామినేటెడ్ అథారిటీ కార్యాలయంలో 46 కంపెనీల నుండి మొత్తం 82 బిడ్లు ఆఫ్-లైన్ / భౌతికంగా స్వీకరించబడ్డాయి. 20 బొగ్గు గనులు / బ్లాకులకు రెండు లేదా అంతకంటే ఎక్కువ బిడ్లు వచ్చాయి.
 

****



(Release ID: 1660180) Visitor Counter : 111