ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ఇంట్లోనే ఇంటిల్లిపాదికి వినాయకచవితి – ఉపరాష్ట్రపతి

• వినాయక చవితి సందర్భంగా దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు

• మట్టి ప్రతిమలతో ఇంట్లోనే కుటుంబసభ్యులతో పండుగను జరుపుకోవాలని సూచన

• ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు కంకణబద్ధులు కావాలని పిలుపు

Posted On: 21 AUG 2020 5:45PM by PIB Hyderabad

ఇంటిల్లిపాదితో ఇంట్లోనే ఆనందంగా వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు సూచించారు. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమస్త జీవుల సమభావనకు ప్రతీకగా నిలిచే వినాయక చవితి ద్వారా శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు సామూహిక సమావేశాలతో జాతీయవాద భావాలను వ్యాప్తి చేశారని, అయితే ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో మట్టితో చేసిన సహజమైన వినాయకుని ప్రతిమలతో వినాయకచవితి పర్వదినాన్ని భక్తి ప్రపత్తులతో కుటుంబంతో కలిసి మార్గదర్శకాలను పాటిస్తూ ఇళ్ళలోనే జరుపుకోవాలని సూచించారు. 

ఆధ్యాత్మికత, ఆనందాల సమ్మిళితంగా పర్యావరణాన్ని పరిరక్షించే వేడుకగానే ఈ ఉత్సవాలను భావించాలని, ప్రతి ఒక్కరూ ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని -  సంస్కృతిని సమతుల్యం చేస్తూ సుసంపన్నమైన మానవాళి భవిష్యత్తు దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

***


(Release ID: 1647656) Visitor Counter : 183