హోం మంత్రిత్వ శాఖ
ప్రఖ్యాత శాస్త్రీయ గాయకుడు పండిట్ జస్రాజ్ మరణంపై కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు.
"సంగీత మార్తాండ్ పండిట్ జస్రాజ్ జీ తన మంత్ర ముగ్ధమైన స్వరంతో భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని సుసంపన్నం చేసిన అద్భుతమైన కళాకారుడు"
"పండిట్ జస్రాజ్ జీ మరణం వ్యక్తిగత నష్టంగా భావిస్తున్నాను"
"పండిట్ జస్రాజ్ తన అసమానమైన ప్రతిభ ద్వారా ఎప్పటికీ మన హృదయాల్లో ఉంటారు"
Posted On:
17 AUG 2020 8:32PM by PIB Hyderabad
ప్రముఖ శాస్త్రీయ గాయకుడు పండిట్ జస్రాజ్ మరణం పై కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు అమిత్ షా సామాజిక మాధ్యమంలో ఒక ట్వీట్ చేస్తూ, "సంగీత మార్తాండ్ పండిట్ జస్రాజ్ జీ తన మంత్ర ముగ్ధమైన స్వరంతో భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని సుసంపన్నం చేసిన అద్భుతమైన కళాకారుడు. ఆయన మరణం వ్యక్తిగత నష్టంగా భావిస్తున్నాను. ఆయన తన అసమానమైన ప్రతిభ ద్వారా ఎప్పటికీ మన హృదయాల్లో ఉంటారు. ఆయన కుటుంబ సభ్యులకు, అనుచరులకు సంతాపం. ఓం శాంతి ” అని పేర్కొన్నారు.
భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రముఖ గాయకులలో పండిట్ జస్రాజ్ ఒకరు. 2000 సంవత్సరంలో, పండిట్ జస్రాజ్, భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నారు.
*****
(Release ID: 1646558)