మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఆత్మ నిర్భర్ భారత్- స్వతంత్ర భారత్ మీద వ్యాస రచన గడువు 23 దాకా పొడిగింపు

Posted On: 14 AUG 2020 7:24PM by PIB Hyderabad

దేశమంతటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న తరుణంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, మై గవ్ తో కలిసి ఆన్ లైన్ వ్యాస రచన పోటీలు ఏర్పాటు చేసింది.  9.10 తరగతులకు సెకండరీ విభాగం కింద, 11,12 తరగతులకు హయ్యర్ సెకండరీ విభాగం కింద దేశవ్యాప్తంగా ఈ పోటీలు జరుగుతాయి.  అయితే, ముందుగా ప్రకటించిన విధగా కాకుండా విద్యార్థులు ఈ నెల 23 వరకు వ్యాసాలు పంపటానికి వెసులుబాటు కల్పించింది.  ఈ ఈవెంట్ కు ఎన్ సి ఇ ఆర్ టి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.


" ఆత్మ నిర్భర్ భారత్ - స్వతంత్ర భారత్ " అనే ప్రధాన అంశానికి తోడుగా ఈ క్రింది ఉప అంశాలను కూడా ఎంచుకోవచ్చు


1. ఆత్మ నిర్భర్ భారత్ కు భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రధాన మూల స్తంభాలు
2. 75 ఏళ్ళ భారత్: ఆత్మ నిర్భర్ భారత్ వైపు దూసుకెళుతున్న జాతి  
3. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ : భిన్నత్వంలో ఏకత్వం ద్వారా నవకల్పనలకు ఊతం
4. డిజిటల్ ఇండియా: కోవిడ్ 19  లోనూ, ఆ తరువాతా అవకాశాలు
5.  ఆత్మ నిర్భర్ భారత్ - దేసాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర  
6. ఆత్మ నిర్భర్ భారత్ - లింగభేదం, కులం, ప్రాంతీయ వివక్షతల నుంచి విముక్తి b్
7. ఆత్మ నిర్భర్ భారత్ : జీవ వైవిధ్యం, వ్యవసాయ సంపద ద్వారా సరికొత్త భారతావని సృష్టి
8. నా హక్కులు వాడుకుంటూ న బాధ్యతలు నెరవేర్చినప్పుడే ఆత్మ నిర్భర్ భారత్ సాకారమవుతుంది.
9. నా శారీరక దృఢత్వమే నా సంపద. అదే ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి  మానవ మూలధనం
10. ఆత్మ నిర్భర్ భారత్ కోసం పచ్చదనానికి పెద్ద పీట
విద్యార్థులు తమ ఎంట్రీలను ఆగస్టు 23లోగా పంపాల్సిన లింక్:  
https://innovate.mygov.in/essay-competition

 

*****



(Release ID: 1645930) Visitor Counter : 192