ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ భాగాల తయారీలో కొత్త శకాన్ని ఆవిష్కరించిన పిఎల్‌ఐ పథకం

వచ్చే 5 ఏళ్లలో రూ.11.50 లక్షల కోట్ల ఉత్పత్తి, రూ.7 లక్షల కోట్ల ఎగుమతి చేయవచ్చని అంచనా:
శ్రీ రవి శంకర్ ప్రసాద్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కి గొప్ప ఊతం

Posted On: 01 AUG 2020 1:44PM by PIB Hyderabad

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పిఎల్‌ఐ) కింద అప్లికేషన్ విండో ముగింపును సూచిస్తూ విలేకరుల సమావేశంలో ప్రసంగించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటి, కమ్యూనికేషన్స్, లా అండ్ జస్టిస్ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్   తయారీదారుల నుండి వచ్చిన దరఖాస్తుల పరంగా పిఎల్‌ఐ పథకం భారీ విజయాన్ని సాధించిందని అన్నారు. పరిశ్రమ ప్రపంచ శ్రేణి ఉత్పాదక గమ్యస్థానంగా భారతదేశ తారా స్థాయి పురోగతిపై తన విశ్వాసాన్ని ఉంచిందని, ఇది స్వావలంబన దేశంగా ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ పిలుపును ప్రతిధ్వనిస్తుందని ఆయన తెలిపారు. "మేము ఆశాజనకంగా ఉన్నాము, విలువతో కూడిన ఈ వ్యవస్థతో అంతటా బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించటానికి, ప్రపంచ విలువ గొలుసులతో అనుసంధానించడానికి ఎదురుచూస్తున్నాము, తద్వారా దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తాము" అని మంత్రి అన్నారు.

భారీ తరహాలో  ఎలక్ట్రానిక్స్ తయారీకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పిఎల్‌ఐ) 2020 ఏప్రిల్ 1 న నోటిఫై అయింది. పిఎల్‌ఐ పథకం భారతదేశంలో తయారయ్యే లక్ష్య విభాగాల కింద వస్తువుల పెరుగుతున్న అమ్మకాలపై (బేస్ సంవత్సరానికి పైగా) 4% నుండి 6% ప్రోత్సాహాన్ని విస్తరించింది. అర్హత కలిగిన కంపెనీలు, బేస్ ఇయర్ (2019-20 ఆర్ధిక సంవత్సరం) తరువాత ఐదేళ్ల కాలానికి. 31.07.2020 వరకు దరఖాస్తులను దాఖలు చేయడానికి ఈ పథకం తెరిచి ఉంది. 01.08.2020 నుండి ఈ పథకం కింద ప్రోత్సాహకాలు వర్తిస్తాయి.

పిఎల్‌ఐ పథకం కింద మొత్తం 22 కంపెనీలు తమ దరఖాస్తును దాఖలు చేశాయి. మొబైల్ ఫోన్ (ఇన్వాయిస్ విలువ రూ.15,000, అంతకంటే ఎక్కువ) కింద దరఖాస్తు చేసుకున్న అంతర్జాతీయ మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు శామ్సంగ్, ఫాక్స్కాన్ హన్ హై, రైజింగ్ స్టార్, విస్ట్రాన్, పెగాట్రాన్. వీటిలో, ఫాక్స్కాన్ హన్ హై, విస్ట్రాన్, పెగాట్రాన్ అనే 3 కంపెనీలు ఆపిల్ ఐఫోన్ల కాంట్రాక్ట్ తయారీదారులు. మొబైల్ ఫోన్‌ల ప్రపంచ అమ్మకాల ఆదాయంలో ఆపిల్ (37%), శామ్‌సంగ్ (22%) కలిసి 60% వాటాను కలిగి ఉన్నాయి. ఈ పథకం దేశంలో వారి తయారీ సామర్థ్యాన్ని బహు విధంగా పెంచుతుందని భావిస్తున్నారు. 

మొబైల్ ఫోన్ (దేశీయ కంపెనీల) విభాగంలో, లావా, డిక్సన్ టెక్నాలజీస్, భగవతి (మైక్రోమాక్స్), ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్, సోజో మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ సహా భారతీయ కంపెనీలు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నాయి. ఈ కంపెనీలు తమ తయారీ కార్యకలాపాలను గణనీయమైన రీతిలో విస్తరించి మొబైల్ ఫోన్ ఉత్పత్తిలో జాతీయ ఛాంపియన్ కంపెనీలుగా ఎదగాలని భావిస్తున్నారు. ఏటి అండ్ ఎస్, అసెంట్ సర్క్యూట్లు, విసికాన్, వాల్సిన్, సహస్రా, విటెస్కో, నియోలింక్ వంటి 10 కంపెనీలు స్పెసిఫైడ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ సెగ్మెంట్ కింద దరఖాస్తులు దాఖలు చేశాయి.

రాబోయే 5 సంవత్సరాల్లో, ఈ పథకం వల్ల మొత్తం ఉత్పత్తి 11,50,000 కోట్ల రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం ఉత్పత్తిలో, మొబైల్ ఫోన్ (ఇన్వాయిస్ విలువ రూ.15,000 మరియు అంతకంటే ఎక్కువ) విభాగంలో ఉన్న కంపెనీలు 9,00,000 కోట్ల రూపాయలకు పైగా ఉత్పత్తిని ప్రతిపాదించాయి, మొబైల్ ఫోన్ (దేశీయ కంపెనీలు) విభాగంలో ఉన్న కంపెనీలు సుమారు 2,00,000 కోట్ల రూపాయల ఉత్పత్తిని ప్రతిపాదించాయి. స్పెసిఫైడ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ విభాగంలో ఉన్నవారు 45,000 కోట్ల రూపాయల ఉత్పత్తిని ప్రతిపాదించారు.

ఈ పథకం వచ్చే 5 సంవత్సరాలలో సుమారు 3 లక్షల ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను కలిపిస్తుంది, అంతేకాకుండా ప్రత్యక్ష ఉపాధి కన్నా దాదాపు 3 రెట్లు అదనపు పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. మొబైల్ ఫోన్‌ల విషయంలో దేశీయ విలువ జోడింపు ప్రస్తుత 15-20% నుండి 35-40% వరకు, ఎలక్ట్రానిక్ భాగాలకు 45-50% వరకు పెరుగుతుందని అంచనా. 

2025 నాటికి భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ డిమాండ్ చాలా రెట్లు పెరుగుతుందని అంచనా వేయడంతో, ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి పిఎల్‌ఐ పథకం, ఇతర కార్యక్రమాలు భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ తయారీకి పోటీ గమ్యస్థానంగా మార్చడానికి, ఆత్మ నిర్భర్ భారత్‌కు ప్రోత్సాహాన్ని ఇస్తాయని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పథకం కింద ఎలక్ట్రానిక్స్ తయారీలో దేశీయ ఛాంపియన్ కంపెనీల ఎదుగుదల అంతర్జాతీయ స్థాయిన లక్ష్యంగా చేసుకుని స్థానిక స్వరం ప్రపంచమంతా పిక్కటిల్లేలా వినిపిస్తుంది అని కేంద్ర మంత్రి తెలిపారు. 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో "డిజిటల్ ఇండియా", "మేక్ ఇన్ ఇండియా" వంటి దూరదృష్టి కార్యక్రమాలలో, గత ఐదేళ్ళలో ఎలక్ట్రానిక్స్ తయారీలో అపూర్వమైన వృద్ధిని భారతదేశం సాధించింది. ఎలక్ట్రానిక్స్ 2019 డిజైన్లపై జాతీయ విధానం ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్ (ఇఎస్‌డిఎమ్) కోసం గ్లోబల్ హబ్‌గా స్థానంగా భారత్ ఎదిగేలా చేస్తుంది. ఎగుమతులను ప్రోత్సహించడం, దేశీయ విలువలను పెంచడం ద్వారా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడటానికి వీలు కల్పిస్తుంది.

***



(Release ID: 1642864) Visitor Counter : 259