ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

'ఆత్మనిర్భర్ భారత్ లోగో రూపకల్పనకు పోటీ' సృజనాత్మకత, స్వావలంబనా స్ఫూర్తికి ప్రోత్సాహంగా మైగవ్ ఆధ్వర్యంలో నిర్వహణ

Posted On: 31 JUL 2020 6:14PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్' పథకానికి విభిన్నమైన గుర్తింపు తీసుకురావాలని భారత ప్రభుత్వం సంకల్పించింది.. ఇందుకోసం దేశ పౌరుల సృజనాత్మక శక్తి ప్రాతిపదికగా ఒక లోగోను (ప్రతికాత్మక చిహ్నాన్ని) రూపొందించాలని నిర్ణయించింది. 'ఆత్మనిర్భర్ భారత్ లోగో రూపకల్పన పోటీ' పేరిట దీన్ని నిర్వహించాలని నిర్ణయించారు. మైగవ్ డాట్ ఇన్ (MyGov.in.) పోర్టల్ ద్వారా పోటీని నిర్వహిస్తారు. ఆసక్తిగలవారు పోటీకి 2020 ఆగస్టు 5 రాత్రి 11-45లోగా ఎంట్రీలు పంపించుకోవచ్చు. విజేతగా నిలిచిన లోగోకు 25వేల రూపాయల నగదు బహుమతి లభిస్తుంది.

  జాతి పరిపాలన, అభివృద్ధి అంశాలపై పౌరులకు క్రియాశీలక ప్రాతినిథ్యం, భాగస్వామ్యం కల్పించేందుకు మైగవ్ అనే ఆన్ లైన్ వేదికను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.   వేదిక ద్వారా  పలు ప్రభుత్వ శాఖల లోగోలు ఇదివరకే రూపొందాయి. స్వచ్ఛ భారత్, దేఖో అప్నాదేశ్, లోక్ పాల్ తదితర పథకాలకు, అంశాలకు సంబంధించి  అనేక లోగోలు,.. మైగవ్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలతోనే రూపొందాయి.

   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ కింద,.. సవాళ్లకు దీటుగా తన సామర్థ్యాన్ని భారత్ ఇప్పటికే ప్రదర్శించింది. అనేక స్ఫూర్తిమంతమైన అవకాశాలను కూడా అందుబాటులోకి తెచ్చింది. కోవిడ్-19 మహమ్మారి సంక్షోభాన్ని, సవాళ్లను కూడా ఎంతో సాహసోపేతంగా, స్వావలంబనతో ఎదుర్కొంది. వ్యక్తిగత రక్షణా పరికరాల (పి.పి..) ఉత్పాదనకు సంబంధించి 2020 మార్చికి ముందు  మాత్రం సామర్థ్యంలేని మన దేశం ఇపుడు రోజూ 2లక్షలమేర పి.పి.. కిట్లను తయారు చేయడం సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్నే సూచిస్తోంది. సామర్థ్యం క్రమంగా పెరుగుతూ పోతోంది.

    దీనికి తోడు, ఆటోమొబైల్ రంగంలోని అనేక పరిశ్రమలు ప్రాణ రక్షణకు తోడ్పడే కృత్రిమ శ్వాస పరికరాలను (వెంటిలేటర్లను) తయారు చేసే ప్రక్రియలో సహకారం అందించడం సవాళ్లను దీటుగా ఎదుర్కొనే దేశ సామర్థ్యాన్ని, సంక్షోభంలో కూడా అవకాశాలను అందుబాటులోకి తెచ్చే పాటవాన్ని కూడా సూచిస్తోంది.

 ఇక లోగో రూపకల్పనాపోటీకి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే connect@mygov.nic.in పోర్టల్ ను సంప్రదించవచ్చు.

***


(Release ID: 1642692)