రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
దేశీయ ఉత్పత్తిని అధికం చేయడానికిగాను ఎరువుల పరిశ్రమను బలోపేతం చేయడానికి పలు చర్యలు
Posted On:
23 JUL 2020 5:43PM by PIB Hyderabad
ఎరువుల పరిశ్రమను అన్ని విధాలా బలోపేతం చేయడానికిగాను ఎన్ డి ఏ ప్రభుత్వం అనేక చర్యలను తీసుకున్నదని కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి శ్రీ డివి సదానంద గౌడ అన్నారు. ఈ చర్యల కారణంగా ఈ పంటల సీజన్లో రైతులకు కావలసినన్ని ఎరువులు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు.
నూతన పెట్టుబడి విధానం-2012, దానికి 2014లో జరిగిన సవరణల ప్రకారం చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ సంస్థ ఆధ్వర్యంలో రాజస్థాన్ లో గడేపాన్ లో బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ప్రారంభమైందని శ్రీ గౌడ అన్నారు. ఇందులో ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 12.7 లక్షల మెట్రిక్ టన్నులు. ఇక్కడ వాణిజ్య సరళిలో ఉత్పత్తి గత ఏడాది జనవరి 1న మొదలైందని, దాంతో అది దేశవ్యాప్తంగా 2019-20లో 244.55 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తికి దోహదం చేసిందని కేంద్ర మంత్రి అన్నారు.
యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికిగాను రామగుండం, తాల్చేర్, గోరఖ్ పూర్, సింద్రీలలోని ఎఫ్ సి ఐ ఎల్ యూనిట్లను బరౌనీలోని హెచ్ ఎఫ్ సి ఎల్ యూనిట్ ను పునరుద్ధరించడం జరిగిందని కేంద్ర మంత్రి అన్నారు. ఇది ఎంపికైన పిఎస్ యుల జాయింట్ వెంచర్. ఇవి ఒక్కొక్కటి 1.27 ఎంఎంటిపిఏ సామర్థ్యమున్న గ్యాస్ ఆధారిత పరిశ్రమలు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి తాజా వివరాలు ఇలా వున్నాయి.
ప్రాజెక్ట్
|
మొత్తం మీద ప్రగతి
|
ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే సమయం
|
రామగుండం
|
99.58%
|
నిర్వహణకు పూర్వ దశ / నిర్వహణ దశ
|
తాల్చేర్
|
59.48%
|
2023 నాటికి ప్రారంభం
|
గోరఖ్ పూర్
|
88.10%
|
2021 నాటికి ప్రారంభం
|
సింద్రీ
|
77.80%
|
2021 నాటికి ప్రారంభం
|
బరౌనీ
|
77.60%
|
2021 నాటికి ప్రారంభం
|
సవరించిన నూతన ధరల పథకం ( ఎన్ పిఎస్- 111) ప్రకారం నాప్తా మీద నడుస్తున్న పరిశ్రమలన్నీ సహజ వాయువును వినియోగించేలా మార్పులు చేయడం జరుగుతోందని కేంద్ర మంత్రి అన్నారు.ఇప్పటికే మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నాప్తా ఫీడ్ స్టాక్ కు బదులుగా సహజవాయువును ఫీడ్ స్టాక్ గా ఉపయోగిస్తోందని అన్నారు. పైపులైన్ కనెక్టివిటీ వచ్చిన తర్వాత గత ఏడాది జులై 29నుంచి ఇది సహజవాయువు ఫీడ్ స్టాక్ తో నడుస్తోంది.
ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్ కోర్ లిమిటెడ్ ( ఎఫ్ ఏ సి టి)ను ఆధునీకరించేందుకుగాను రూ. 900 కోట్ల నిధులను ఖర్చు చేయాలనే ప్రధాన నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు.
*******
(Release ID: 1640764)
Visitor Counter : 160