ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మిజోరాంలో జోరం మెగా ఫుడ్ పార్క్ ను ఈ-ప్రారంభం చేసిన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి శ్రీమతి హర్సిమ్రత్ కౌర్ బాదల్
ఫుడ్ఆ పార్క్ ఈ ప్రాంతంలో రైతుల ఆదాయం రెట్టింపు కావడానికి ఉపయోగపడడమే కాకుండా, యువతకు లాభదాయకమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్
ఈశాన్య ప్రాంతాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అభివృద్ధి ఎజెండా ను ముందుకు తీసుకెళ్లడానికి డోనర్ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
20 JUL 2020 3:46PM by PIB Hyderabad
కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి, సభ్యుడు శ్రీమతి హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఈ రోజు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మిజోరాం లోని కొలాసిబ్ వద్ద ఉన్న జోరం మెగా ఫుడ్ పార్క్ లిమిటెడ్ ను ప్రారంభించారు. రూ .75 కోట్ల వ్యయంతో 55 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఫుడ్ పార్క్ నేరుగా 25 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రాంతంలోని 5,000 మందికి పైగా ఉపాధి అవకాశాలను అందిస్తుంది. ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవాన్ని ఈ ప్రాంతానికి నవోదయంగా అభివర్ణించిన శ్రీమతి బాదల్, ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ కలను సాకారం చేసుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. గత ఆరు సంవత్సరాల్లో, మిజోరంలో 7 ప్రాజెక్టులతో సహా 88 ప్రాజెక్టులు మొత్తం ఈశాన్య ప్రాంతానికి రూ .1000 కోట్ల వ్యయంతో ప్రారంభించామని, ఇది 3 లక్షల మంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుందని, ఈ ప్రాంతానికి చెందిన 50,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని ఆమె తెలిపారు. .
గత 6 సంవత్సరాలలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈశాన్య ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని, ఈశాన్య ప్రాంత అభివృద్ధి కేంద్ర మంత్రి (స్వతంత్ర ఛార్జ్) (డోనెర్) డాక్టర్ జితేంద్ర గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రధాని ఈ ప్రాంత అవసరాలు, ఆకాంక్షలపై సూక్ష్మ దృష్టితో పని సంస్కృతిని మార్చారని ఆయన అన్నారు. 2014 లో మోడీ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే, ఈశాన్య ప్రాంతాన్ని దేశంలోని మరింత అభివృద్ధి చెందిన ప్రాంతాలతో సమానంగా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని ప్రధాని పేర్కొన్నారని, సిక్కిం, త్రిపుర తరువాత ఈశాన్యంలో మూడవ విద్యుత్-మిగులు రాష్ట్రంగా మార్చడానికి 2017 డిసెంబరులో మిజోరాంలో 60 మెగావాట్ల ట్యూరియల్ హైడ్రోపవర్ ప్రాజెక్టును ప్రధాని స్వయంగా అంకితం చేశారని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేసుకున్నారు. ఈశాన్య ప్రాంతం సమగ్ర అభివృద్ధికి మోడీ ప్రభుత్వం ఉద్దేశం, నిబద్ధత, చిత్తశుద్ధి చాలా స్పష్టంగా ఉందని, ఈ ఆదేశాన్ని, ఎజెండాను డోనర్ మంత్రిత్వ శాఖ ముందుకు తీసుకువెళుతోందని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాలు దాని గొప్ప మరియు విభిన్న సాంస్కృతిక అనుభవాల నుండి చాల నేర్చుకోవడానికి అవకాశం ఇస్తున్నందున మిగిలిన భారతదేశాన్ని ఈశాన్యానికి దగ్గరగా తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మధ్యవర్తులను తొలగించడం ద్వారా ఈ ప్రాంతంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఇది సహాయపడుతుందని అన్నారు. ప్రాసెసింగ్ యూనిట్ లేనప్పుడు దాదాపు 40% పండ్లను వృధా చేయడాన్ని ప్రస్తావిస్తూ, భారతదేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో ధనిక, అధిక రకాల పండ్లను స్వచ్ఛమైన ప్యాకేజీ రసంగా విక్రయించవచ్చని మంత్రి శ్రీ జితేంద్ర సింగ్ అన్నారు. ఈశాన్య ప్రాంతం గొప్ప వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల కారణంగా ప్రపంచంలోని సేంద్రీయ గమ్యస్థానంగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు. సిక్కింను ఇప్పటికే సేంద్రీయ రాష్ట్రంగా ప్రకటించినట్లు ఆయన తెలిపారు.
.
కేరళ తరువాత మిజోరాం అక్షరాస్యత రేటు అత్యధికంగా 96 శాతం ఉండడాన్ని, మంచి క్రమశిక్షణ సంస్కృతి కలిగి ఉండడాన్ని శ్రీ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. రాష్ట్రం చొరబాట్లు, మాదకద్రవ్యాల జాడ్యం నుండి విముక్తి కోసం మొత్తం పౌర సమాజం మరియు ధార్మిక సంస్థలు కలిసి పనిచేయడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు. మూడవ లాక్ డౌన్ వరకు కొరోనా రహితంగానే కొనసాగుతుండడం పట్ల మిజోరాంను మంత్రి ప్రశంసించారు, కోవిడ్ అనంతర కాలంలో భారతదేశం తన భారీ సహజ, మానవ నైపుణ్య వనరుల సహకారంతో ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఈశాన్య ప్రాంతం తగు పాత్ర పోషిస్తూ ముందడుగు వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జోరామ్ మెగా ఫుడ్ పార్క్ జాతీయ రహదారి 54 సమీపంలో ఉండడం వల్ల రవాణా అడ్డంకులను అధిగమించి త్వరలో ఈ ప్రాంతంలో పండించే అధిక రకాల ఆహారాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, కూరగాయలను నిల్వ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి ఒక ప్రధాన మైలురాయిగా మారుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి మాట్లాడుతూ శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం గత ఆరు సంవత్సరాల్లో 37 మెగా ఫుడ్ పార్కులు ఆమోదించిందని తెలిపారు. వాటిలో 18 ఇప్పటికే అమలులో ఉన్నాయని చెప్పారు. మిజోరం వాణిజ్య, పరిశ్రమల మంత్రి డాక్టర్ ఆర్. లాల్తాంగ్లియానా, విద్యుత్ మంత్రి ఆర్. లాల్ జిర్లియానా , లోక్సభ ఎంపి సి. లాల్రోసంగా, ఆహార మంత్రిత్వ శాఖ, మిజోరాం ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు ఈ-ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
****
(Release ID: 1639988)
Visitor Counter : 205