ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
41 వేలకు పైగా ఆయుష్మాన్ భారత్- ఆరోగ్య, వెల్నెస్ సెంటర్లు (ఎబి-హెచ్డబ్ల్యుసి) సార్వత్రిక, సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందిస్తాయి, ముఖ్యంగా కోవిడ్-19 సమయంలో
గత ఐదు నెలల్లో హెచ్డబ్ల్యుసిలలో 8.8 కోట్ల ఫుట్ఫాల్స్ నమోదయ్యాయి
Posted On:
10 JUL 2020 12:32PM by PIB Hyderabad
ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలు (హెచ్డబ్ల్యుసి) ఆయుష్మాన్ భారత్ కి మూల కేంద్రాలవంటివి. 2022 నాటికి 1,50,000 ఉప ఆరోగ్య కేంద్రాలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను హెచ్డబ్ల్యుసిలుగా మార్చడం ద్వారా సార్వత్రిక, సమగ్ర ప్రాధమిక ఆరోగ్య సంరక్షణను అందించాలని ఆయుష్మాన్ భారత్ సంకల్పం.
కోవిడ్-19 కు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఎబి-హెచ్డబ్ల్యుసి లు చేసిన అసాధారణ సహకారానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. జార్ఖండ్లో, స్టేట్ వైడ్ ఇంటెన్సివ్ పబ్లిక్ హెల్త్ సర్వే వారంలో భాగంగా, హెచ్డబ్ల్యుసి బృందాలు ఇన్ఫ్లుఎంజా లైక్ ఇల్నెస్ (ఐఎల్ఐ), తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (సారి) లక్షణాల కోసం ప్రజలను పరీక్షించాయి, కోవిడ్ -19 కోసం పరీక్షను సులభతరం చేశాయి.
ఒడిశాలోని శుభాలయలోని హెచ్డబ్ల్యుసి బృందం ఆరోగ్య పరీక్షలను నిర్వహించింది. కోవిడ్-19 కోసం నివారణ చర్యల గురించి ప్రజలలో అవగాహన కల్పించింది, సబ్బు, నీటితో తరచుగా చేతులు కడుక్కోవడం, బహిరంగ ప్రదేశాల్లో అడుగు పెట్టేటప్పుడు మాస్కులు / ముఖ కవర్లు ధరించడం, తగినంత శారీరక దూరాన్ని నిర్వహించడం ప్రజలతో సంభాషించడం మొదలైనవి. వారు క్వారంటైన్ కేంద్రాలుగా పనిచేస్తున్న తాత్కాలిక వైద్య శిబిరాల వద్ద వలస వచ్చినవారికి వెల్నెస్ సెషన్లు కూడా నిర్వహించారు. బికానెర్-జోధ్పూర్ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద కోవిడ్-19 కోసం ప్రయాణికులందరినీ పరీక్షించడంలో రాజస్థాన్ లోని గ్రాండి హెచ్డబ్ల్యుసి బృందం స్థానిక జిల్లా పరిపాలనకు మద్దతు ఇచ్చింది. కోవిడ్-19 యొక్క కమ్యూనిటీ వ్యాప్తిని నివారించడానికి నివారణ చర్యలపై మేఘాలయలోని హెచ్డబ్ల్యుసి టైన్రింగ్ బృందం సంఘం నాయకులు, పాఠశాల ఉపాధ్యాయుల అవగాహన కార్యక్రమం నిర్వహించింది.
వారు పనిచేస్తున్న సమాజాలలో మౌలికమైన పనికి సాక్ష్యంగా, ఈ సంవత్సరం ఫిబ్రవరి 1 నుండి ఐదు నెలల్లో 8.8 కోట్ల ఫుట్ఫాల్స్ను హెచ్డబ్ల్యుసిలలో నమోదు చేశారు. ఈ సంవత్సరం మధ్యంతర లాక్ డౌన్ వ్యవధిలో ప్రజల కదలికలపై ఆంక్షలు ఉన్నప్పటికీ, 21 నెలల్లో, 2018 ఏప్రిల్ 14 నుండి 2020 జనవరి 31 వరకు 21 నెలల్లో నమోదైన ఫుట్ఫాల్ల సంఖ్యకు ఇది దాదాపు సమానం. ఇది కాకుండా, గత ఐదు నెలల్లో, 1.41 కోట్ల మంది వ్యక్తులను రక్తపోటు కోసం హెచ్డబ్ల్యుసిలలో, డయాబెటిస్కు 1.13 కోట్లు, నోటి, రొమ్ము లేదా గర్భాశయ క్యాన్సర్కు 1.34 కోట్లు పరీక్షించారు. కోవిడ్-19 ఎదుర్కొన్న సవాళ్లు ఉన్నప్పటికీ, జూన్ నెలలో మాత్రమే రక్తపోటు ఉన్న 5.62 లక్షల మంది రోగులకు, 3.77 లక్షల మంది మధుమేహ రోగులకు హెచ్డబ్ల్యూసి లలో మందులు పంపిణీ చేసాయి. కోవిడ్-19 వ్యాప్తి చెందిన కాలంలో హెచ్డబ్ల్యూసిలలో 6.53 లక్షల యోగా, వెల్నెస్ సెషన్లు కూడా నిర్వహించారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో, ఆరోగ్య వ్యవస్థల స్థితిస్థాపకత హెచ్డబ్ల్యూసి ల నిరంతర కార్యాచరణ, కోవిడ్-19 కాని ఆరోగ్య సేవలను నిరంతరం నిర్వహించడం ద్వారా ప్రతిబింబిస్తుంది, అయితే కోవిడ్-19 నివారణ నిర్వహణ అత్యవసర పనులను కూడా నెరవేరుస్తుంది. 2020 జనవరి నుండి జూన్ మధ్య, అదనంగా 12,425 హెచ్డబ్ల్యుసిలు పనిచేస్తున్నాయి, దీనితో హెచ్డబ్ల్యుసిల సంఖ్య 29,365 నుండి 41,790 కు పెరిగింది.
కోవిడ్ కాని ముఖ్యమైన సేవలను వారి సంఘాలకు అందించేలా చూడడంలో హెచ్డబ్ల్యూసి జట్లు కీలక పాత్ర పోషించాయి. నాన్-కమ్యూనికేట్ వ్యాధుల కోసం జనాభా-ఆధారిత స్క్రీనింగ్లను చేపట్టిన తరువాత, హెచ్డబ్ల్యుసి బృందాలు ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవారి జాబితాను కలిగి ఉన్నాయి, సహ-వ్యాధిగ్రస్థత ఉన్న వ్యక్తులను వేగంగా పరీక్షించగలవు సంక్రమణ నుండి రక్షణ కోసం సలహాలను అందిస్తాయి. గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు జరిగేలా హెచ్డబ్ల్యుసి బృందాలు ఇమ్యునైజేషన్ సెషన్లు నిర్వహిస్తున్నాయి. టిబి, లెప్రసీ, హైపర్టెన్సివ్, డయాబెటిక్ రోగులకు అవసరమైన మందుల పంపిణీని కూడా హెచ్డబ్ల్యుసి బృందాలు చేపడుతున్నాయి.
సమాజానికి దగ్గరగా ఉన్న ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల ఏర్పాటు సమాజానికి అవసరమైన ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో కీలకమని ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలు నిరూపించాయి.
ఆయుష్మాన్ భారత్ హెచ్డబ్ల్యుసిల నుండి కొన్ని సంగ్రహావలోకనాలు: ప్రజలకు మరింత దగ్గరకు ఆరోగ్య సంరక్షణ






***
(Release ID: 1637798)
Visitor Counter : 298