నీతి ఆయోగ్
'ప్రవర్తన మార్పు' ప్రచారోద్యమాన్ని, వెబ్సైట్ను ప్రారంభించిన నీతీ ఆయోగ్
(అందరూ ముఖ ముసుగు ధరించడంపై ముఖ్యమైన దృష్టి)
Posted On:
25 JUN 2020 8:03PM by PIB Hyderabad
బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ (బీఎమ్జీఎఫ్), సెంటర్ ఫర్ సోషల్ అండ్ బిహేవియరల్ చేంజ్ (సీఎస్బీసీ), అశోక విశ్వవిద్యాలయం మరియు ఆరోగ్య మరియు డబ్ల్యూసీడీ మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో నీతి ఆయోగ్ ఈ రోజు 'నావిగేటింగ్ ది న్యూ నార్మల్' (కొత్త సాధరాణత దిశగా పయనం) అనే ప్రవర్తన మార్పు ప్రచారపు కార్యక్రమాన్ని, దాని వెబ్సైట్ను ప్రారంభించింది.
ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్ మహమ్మారి ‘అన్లాక్’ దశ కొనసాగుతున్నందున కోవిడ్-సురక్షిత ప్రవర్తనలపై దృష్టి సారించి.. మరీ ముఖ్యంగా ముఖ ముసుగు ధరింపు అంశం ప్రచారానికి గాను నీతీ ఆయోగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్, సీఈఓ అమితాబ్ కాంత్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ కె.విజయరాఘవన్, బీఎంజీఎఫ్ భారత దేశపు డైరెక్టర్ హరి మీనన్, ప్రసిద్ధ పాటల రచయిత మరియు మక్కాన్ వరల్డ్గ్రూప్ ఇండియా సీఈవో మరియు సీసీఓ ప్రసోన్ జోషి సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. వీరికి తోడు నీతీ ఆయోగ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, బీఎంజీఎఫ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నీతి ఆయోగ్తో కలిసి పనిచేస్తున్న 92,000 ఎన్జీవోలు మరియు పౌర సమాజ సంస్థలు (సీఎస్ఓలు) ఈ వర్చువల్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమం వెబ్కాస్ట్ ద్వారా జరిగింది. నీతీ సీఈఓ ఆయోగ్ అధ్యక్షతన భారత ప్రభుత్వంతో ఏర్పాటు చేసి ఎంపవర్డ్ గ్రూప్ 6 యొక్క మార్గదర్శకత్వంలో ఇది అభివృద్ధి చేయబడింది. టీకా వచ్చేంత వరకు జాగ్రత్తలు అవసరం. ఈ ప్రచార కార్యక్రమం రెండు భాగాలుగా ఉండనుంది.
అన్లాక్ దశలో కోవిడ్-సురక్షిత ప్రవర్తన నిబంధనల్ని తిన్నగా తెలియజేయడం, సామాజిక నిబంధనల సిద్ధాంతాన్ని ఉపయోగించడం కోసం ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్ http://www.covidthenewnormal.com ద్వారా తెలియ జేయడం మొదటిది. కోవిడ్ నేపథ్యంలో ముఖ మాస్క్లు ధరించే విషయమై దృష్టి మీడియా ప్రచారం నిర్వహించడం. కార్యక్రమంలో నీతీ ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ ‘ఇండియా అన్లాక్ చేస్తున్నప్పుడు, ఒక కీలక ఆందోళన ఏమిటంటే ప్రజలు మరియు సంస్థలను కోవిడ్ - సురక్షిత ప్రవర్తన విధానాలు అభ్యసించేలా మేము ప్రోత్సహిస్తాము. కోవిడ్కు టీకా అందుబాటులోకి వచ్చేంత వరకు కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు గాను ప్రతి ఒక్కరూ చేతి పరిశుభ్రత మరియు సామాజిక దూరాన్ని అభ్యసించడంతో పాటుగా ముఖ ముసుగులను ధరింపజేయడం చాలా ముఖ్యం. ఎంపవర్డ్ గ్రూపు 6, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ప్రజలకు మేము కోరుకున్న సామాజిక ప్రవర్తన పట్ల విరుచుకుపడాలని తాము కోరుకుంటున్నాము, దీంతో కోవిడ్ భద్రత జాగ్రత్తల భారం ప్రభుత్వం నుండి పౌరులకు మారుతుంది. నీతీ ఆయోగ్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ మరియు సెంటర్ ఫర్ సోషల్ అండ్ బిహేవియరల్ చేంజ్ భాగస్వామ్యంతో ప్రజలకు వివిధ సందేశాలు మరియు రిమైండర్లను అందించే ప్రయత్నం చేసింది. ఆయా ప్రవర్తనలను అభ్యసించడం సులభం అయ్యే విధంగా తగిన వాతావరణాన్ని రూపకల్పన చేసే సరళమైన, సాధన చేయడానికి సులభమైన ఆలోచనలతో పాటు ప్రాంప్ట్లు మరియు రిమైండర్లను ప్రజలకు అందించే ప్రయత్నం కూడా చేస్తోంది.
![](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00172W9.jpg)
మన ప్రవర్తనపైనే భవిత ఆధారపడి ఉంది నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ మాట్లాడుతూ మన భవిష్యత్తు వైరస్ మీద ఆధారపడి లేదని మన ప్రవర్తనపై ఆధారపడి ఉందని అన్నారు. ‘మనం దూరాన్ని సృష్టించడం, ముసుగులు ధరించడం లేదా టీకా వంటి అడ్డంకిని ఉపయోగించినా వైరస్ వ్యాప్తి చెందదు. కరోనాతో ఈ యుద్ధాన్ని మానవత్వం యొక్క చాతుర్యంతో పోరాడుతున్నాము. ఆదర్శవంతమైన ప్రపంచంలో మనం ఈ కోవిడ్-సురక్షిత ప్రవర్తనలను సృష్టించి, బలపరిస్తే, వైరస్ వ్యాప్తి చెందదు.
ఆందోళన కలిగించే విధంగా ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలలో చిన్నచిన్న కర్మాగారాలు మరియు పేద కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ఈ సందేశాలు వారి వరకు చొచ్చుకుపోయి చేరుకోవాల్సి ఉంది. ఈ ప్రవర్తన మార్పు ప్రచారం మేము నిర్మిస్తున్నప్పుడు అనేక ఇతర తంతువులు ఉంటాయని మేము ఆశిస్తున్నాము; ఇది కేవలం అలలా కాకుండా ఉప్పెనలా ప్రవర్తన మార్పు ముందుకు సాగాలి. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె. విజయరాఘవన్ ఈ చొరవను ప్రశంసించారు. సామాజిక దూరాన్ని మనం సమర్థవంతంగా పాటించనంత వరకు ఈ వ్యాధి అప్రధానమైన రీతిలో వ్యాపిస్తుందని అన్నారు. ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ రాజేశ్ భూషణ్ ఈ ప్రచారానికి మంత్రిత్వ శాఖ పూర్తి మద్దతు తెలిపారు.
రక్షణాత్మక ప్రవర్తన సాధారణీకరణ బీఎంజీఎఫ్ ఇండియా కంట్రీ డైరెక్టర్ హరి మీనన్ మాట్లాడుతూ ’జాతీయ కోవిడ్ -19 ప్రతిస్పందనకు తగిన మద్దతు ఇవ్వడానికి భారత ప్రభుత్వం మరియు నీతీ ఆయోగ్తో మా భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాము. కోవిడ్ -19 వైరస్ నివారణ ప్రవర్తనలను ప్రోత్సహించడానికి ప్రవర్తనా శాస్త్రాన్ని ఆచరణలో, సులభమైన మరియు సరళమైన పద్ధతిలో ఉంచే ఈ నవ్య చొరవపై ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మాకు గౌరవంగా భావిస్తున్నాము. "నావిగేటింగ్ ది న్యూ నార్మల్" ప్రచారం రక్షణాత్మక ప్రవర్తనలను సాధారణీకరించడానికి సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను, ముఖ్యంగా ముసుగు ధరించే విషయంలో’ అని అన్నారు.
ముఖ ముసుగు అవసరాన్ని గుర్తించాలి ప్రసిద్ధ పాటల రచయిత మరియు మక్కాన్ వరల్డ్గ్రూప్ ఇండియా సీఈవో మరియు సీసీఓ ప్రసూన్ జోషి మాట్లాడుతూ ‘ఈ దశలో మనకు చాలా సవాళ్లు ఉన్నాయి. కోవిడ్-తగిన ప్రవర్తనలు మన దినచర్యలో భాగమయ్యే వరకు వాటిని బలోపేతం చేయాలి. ముసుగులు ధరించే పద్ధతిని అనుసరించేలా ప్రజలకు తెలియజేసి సంసిద్ధులను చేయాలి. ఒక మంచి సమాజంగా మనం ముఖ ముసుగులు ధరించాల్సిన అవసరాన్ని అంగీకరించాలి, దానిని స్వీకరించి మన ప్రవర్తనలో ప్రతిబింబించాలి.’ అని అన్నారు.
ప్రచారం గురించి & వెబ్ సైట్ గురించి: ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూ మరియు ఇతర వాటాదారులతో సంప్రదించి అభివృద్ధి చేయబడిన ఈ వెబ్సైట్ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం మరియు సీఎస్వో లు మరియు ఎన్జీఓ లను నిమగ్నం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
![A person sitting at a tableDescription automatically generated](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0021K3Z.jpg)
వివిధ రంగాలలో కోవిడ్-సురక్షిత ప్రవర్తనలను అభ్యసించడానికి ఇది వ్యూహాలు మరియు అనుషంగికల రిపోజిటరీగా మారుతుంది. సీఎస్ఓలు, ఎన్జీఓలు, ప్రజా, సంస్థలు, అంగన్వాడీ కార్మికులు, జిల్లా పరిపాలన విభాగంతో సహా ఎవరికైనా ఓపెన్ సోర్స్ యాక్సెస్ కల్పించడం దీని లక్ష్యం. ఈ సమాచారం లభ్యతతో, సంస్థలు మరియు పౌర సమాజ సంస్థలు కోవిడ్-సురక్షిత ప్రవర్తనలను అభ్యసించేటప్పుడు వారి సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ప్రణాళిక రూపొందించవచ్చు.
అన్లాక్ దశలో నాలుగు ముఖ్య ప్రవర్తనలను సులభంగా అమలు చేయడంపై పోర్టల్ దృష్టి పెడుతుంది:
1. ముఖ మాస్క్ను ధరించడం
2. సామాజిక దూరం పాటించడం
3. చేతుల పరిశుభ్రత
4. జన సంచార ప్రదేశంలో ఉమ్మివేయకుండా ఉండడం
వెబ్సైట్లో ఆరోగ్యం, పోషణ మరియు ప్రజా రవాణా (మెట్రో నగరాల్లో) కోసం సెక్టార్-నిర్దిష్ట అనుషంగికలు మరియు మార్గదర్శకాలు ఉంటాయి.
![A screen shot of a computerDescription automatically generated](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003R8N8.jpg)
https://www.youtube.com/watch?v=pbaSzQQ9q5s&feature=youtu.be
ముఖ మాస్క్ ధరించే ప్రచారంపై దృష్టి..
ముసుగులు ధరించడానికి సరైన విధానాలను తెలిపేందుకు గాను మీడియా ఉపయోగించబడుతుంది. కోవిడ్ -19 కి వ్యతిరేక పోరాటంలో ఈ చిన్నచిన్న జాగ్రత్తలు పెద్ద మార్పు తీసుకువచ్చేందుకు దోహదం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ‘ముసుగు ధరించడం’ను సామాజికంగా ఆమోదించబడిన ప్రమాణంగా మార్చాయి. ముసుగు ధరించే ప్రచారాన్ని బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్ మెక్కాన్ వరల్డ్గ్రూప్ భాగస్వామ్యంతో రూపొందించాయి.
****
(Release ID: 1634375)
Visitor Counter : 363