రక్షణ మంత్రిత్వ శాఖ
మిషన్ సాగర్: మారిషస్లోని పోర్ట్ లూయిస్కు పయనమైన ఐఎన్ఎస్ కేసరి నౌక
Posted On:
14 JUN 2020 7:16PM by PIB Hyderabad
'మిషన్ సాగర్'లో భాగంగా భారత నావికా దళం నౌక కేసరి ఆదివారం (14వ తేదీన) మారిషస్లోని పోర్ట్ లూయిస్కు తిరుగు పయనమైంది. మే 23వ తేదీన ఈ నౌక తన గత పోర్ట్ లూయిస్ పర్యటనలో భాగంగా భారత నావికా దళం వైద్య బృందంను మారిషస్లో వైద్య సేవల నిమిత్తం వదిలి వచ్చింది. తాజాగా ఇప్పుడు వారిని భారత్కు తీసుకువచ్చేందుకు తిరుగు పయనమైంది. కోవిడ్ - 19 మహమ్మారి నియంత్రణ, నిర్వహణకు సహాయపడటం, వ్యాధి వ్యాప్తి అరికట్టడానికి మరియు ప్రాణాలకు ప్రమాదాన్ని తగ్గించే విషయంలో సహాయపడడానికి నైపుణ్యం కలిగిన నిపుణులు మరియు పారామెడిక్స్తో కూడిన 14 మంది సభ్యుల వైద్య బృందాన్ని భారత్ పోర్ట్ లూయిస్కు పంపించింది. ఈ వైద్య బృందం పోర్ట్ లూయిస్లో ఉన్న సమయంలో స్థానికంగా ఉన్న ప్రాంతీయ ఆసుప్రతులు, ఫ్లూ క్లినిక్లు, ఈఎన్టీ హాస్పిటల్ (మారిషస్లో ప్రత్యేకంగా ఎంపిక చేసిన కోవిడ్ హాస్పిటల్), క్వారంటయిన్ కేంద్రాలు, మారిషస్లోని కోవిడ్ పరీక్షా సౌలభ్యాలతో కూడిన సెంట్రల్ హెల్త్ లాబొరేటరీ మరియు ఎస్ఏఎంయూ (అత్యవసర వైద్య సర్వీసుల కేంద్రం) విక్టోరియా ఆసుపత్రిలో ఉన్న ప్రధాన కార్యాలయం మరియు నియంత్రణ కేంద్రంలను కూడా సందర్శించింది. తమ పర్యటనలో భాగంగా ఈ బృందం అన్ని స్థాయిల ఆరోగ్య సంరక్షణ యోధులతో సంభాషించింది. కోవిడ్-19 నిర్వహణపై ఉత్తమ పద్ధతులను పంచుకునే దిశగా అర్ధవంతమైన చర్చలు జరిపింది. కోవిడ్ నేపథ్యంలో మన చేతుల పరిశుభ్రత, స్క్రీనింగ్ మరియు చికిత్స, క్రిమిసంహారక మరియు పీపీఈల వంటి ముఖ్యమైన అంశాలపై ప్రదర్శనలు మరియు వర్క్షాప్లు నిర్వహించారు. ఆయా సెషన్లలో ప్రేక్షకుల స్పందన చాలా ప్రోత్సాహకరంగా కనిపించింది. ఆరోగ్య సంరక్షణ కార్మికుల భవిష్యత్ సూచనల కోసం ‘గైడ్ టు కంటైన్ అండ్ కంబాట్ కోవిడ్ -19’ మరియు 'హెల్త్ కేర్ వర్కర్స్ యొక్క మాన్యువల్ ఆన్ ట్రైనింగ్ ’ అనే రెండు విధాన పత్రాల పీడీఎఫ్ వెర్షన్లనూ ఈ బృందం స్థానిక వైద్య అధికారులతో పంచుకుంది. ఐఎన్ఎస్ కేసరిలో బయలుదేరేందుకు ముందుగా డిప్యూటీ హై కమిషనర్ శ్రీ జనేష్ కైన్ కూడా ఇండియన్ నేవీ మెడికల్ టీమ్ సభ్యులతో సంభాషించారు. ‘మిషన్ సాగర్’ కార్యక్రమం ఈ ప్రాంతంలో మొట్టమొదటి ప్రతిస్పందనగా మనదేశ పాత్రను సూచిస్తోంది. కోవిడ్ -19 వైరస్ మహమ్మారిని మరియు దాని పర్యవసానంగా ఎదురయ్యే ఇబ్బందులు ఎదుర్కోవటానికి ఇరు దేశాల మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాలను ‘మిషన్ సాగర్’ మరింతగా పెంపొందించే అవకాశం ఉంది. ‘సాగర్’ ప్రాంతంలోని దేశాల భద్రత మరియు వృద్ధి యొక్క ప్రధాన మంత్రుల దృష్టికి అనుగుణంగా ఈ చర్యను చేపట్టారు. ఐఓఆర్ దేశాలతో సంబంధాలకు భారతదేశం ఇచ్చిన ప్రాముఖ్యతను కూడా ఇది తెలియజేస్తుంది. రక్షణ మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖలు మరియు భారత ప్రభుత్వ ఇతర ఏజెన్సీల సన్నిహిత సమన్వయంతో ఈ ఆపరేషన్ ముందుకు సాగుతోంది.
(Release ID: 1631583)
Visitor Counter : 307