ఆర్థిక మంత్రిత్వ శాఖ
2020 ఏప్రిల్ 1వ తేదీ నుండి రూ.26,242 కోట్ల రిఫండ్స్
प्रविष्टि तिथि:
22 MAY 2020 3:15PM by PIB Hyderabad
ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు (సీబీడీటీ) 2020 ఏప్రిల్ 1 నుండి 2020మే 21వ తేదీ వరకు 16,84,298 మంది మదింపుదారులకు రూ.26,242 కోట్ల పన్ను రిఫండ్స్ ను చెల్లించింది.
ఆదాయపు పన్ను రిఫండ్స్ 15,81,906 మదింపుదారులకు రూ. 14,632 కోట్లు, కార్పొరేట్ పన్ను రిఫండ్స్ ఈ కాలంలో 1,02,392 మదింపుదారులకు రూ. 11,610 కోట్లు జారీ చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గత వారం ఆత్మ నిర్భర ప్యాకేజీ ప్రకటన తర్వాత రిఫండ్ ప్రక్రియ వేగవంతం అయి, రిఫండ్స్ జారీ తీవ్ర గతిలో సాగుతోంది.
సిబిడిటి మే 16 తో ముగిసిన మునుపటి వారంలో రూ. 2050.61 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది, అంటే 2020 మే 9 నుండి 16 వరకు 37,531 ఆదాయపు పన్ను మదింపుదారులకు ఉద్దేశించినది ఇది. 2878 కార్పొరేట్ పన్ను మదింపుదారులకు రూ. 867.62 కోట్లు విడుదలయ్యాయి. ఈ వారంలో, అంటే 2020 మే 17 నుండి 21 వరకు, మరో 1,22,764 ఆదాయపు పన్ను మదింపుదారులకు రూ. 2672.97 కోట్లు తిరిగి ఇవ్వబడ్డాయి. ట్రస్ట్లు, ఎంఎస్ఎంఇలు, యాజమాన్య హక్కులు, భాగస్వామ్యాలు మొదలైన 33,774 కార్పొరేట్ పన్ను మదింపుదారులకు రూ. 6714.34 విలువైన రిఫండ్స్ ఇచ్చివేశారు. అంటే 1,56,538 మదింపుదారులకు మొత్తం రూ .9387.31 కోట్లకు తిరిగి చెల్లించబడుతుంది.
****
(रिलीज़ आईडी: 1626091)
आगंतुक पटल : 322
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
हिन्दी
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Odia
,
Kannada