రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

సైనిక దళాధిపతి జనరల్ ఎంఎం న‌ర‌వాణే తూర్పు ప్రాంతంలోని దళాల సందర్శన

Posted On: 05 MAY 2020 8:23PM by PIB Hyderabad

సైనిక దళాల ప్రధానాధిపతి జనరల్ ఎంఎం నరవాణే సోమ, మంగళవారాల్లో తూర్పు ప్రాంతంలోని క్షేత్ర స్థాయి సైనిక దళాలను సందర్శించారు. ఆయన సందర్శించిన వాటిలో సుక్నా, బిన్నాగురి, పనాగఢ్ దళాలున్నాయి.
 
ఈ రెండు రోజుల సందర్శన సమయంలో ఆయనకు ఆ సైనిక దళాల కమాండర్లు ఏ క్షణంలో ఏ రకమైన దాడి అయినా నిర్వహించడానికి తమ సంసిద్ధతను, శిక్షణ, లాజిస్టిక్స్ కు సంబంధించిన ప్రధానాంశాలను వివరించారు. సైనిక దళాధిపతి క్షేత్రస్థాయి సైనిక దళాలతో కూడా చర్చించి సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. కోవిడ్-19పై పోరాటానికి తమ వంతుగా భారత సైన్యం ఏర్పాటు చేసిన వివిధ కేంద్రాలను కూడా ఆయన పరిశీలించారు. సాయుధ దళాల పోరాట సమాయత్తతను, శిక్షణ ప్రమాణాలను ఆయన కొనియాడుతూ ఈ క్లిష్ట సమయంలో వారు చక్కని సేవలు కొనసాగించాలని సూచించారు.

 



(Release ID: 1621413) Visitor Counter : 111