పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 లాక్డౌన్ కాలంలో లైఫ్లైన్ ఉడాన్ కింద 452 విమాన రవాణా సేవలు
Posted On:
05 MAY 2020 7:12PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా లైఫ్లైన్ ఉడాన్లో భాగంగా దాదాపు 452 విమానాలు రవాణా కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్, ఐఏఎఫ్ మరియు ప్రైవేట్ క్యారియర్ల విమానాలు రవాణా కార్యక్రమాలను చేపట్టాయి. ఇందులో 272 విమానాలను ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్ సంస్థల విమానాలు ఉన్నాయి. ఈ విమానాలు ఇప్పటి వరకు 824.44 టన్నుల మేర సరుకును రవాణా చేశాయి.
ఇప్పటి వరకు లైఫ్లైన్ ఉడాన్లో భాగంగా ఆయా విమానాలు 4,41,564 కి.మీ. వైమానిక దూరం మేర ప్రయాణించాయి. కోవిడ్ -19కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న యుద్ధానికి మద్దతుగా కేంద్ర పౌర విమానయాన శాఖ (ఎంఓసీఏ) మారుమూల ప్రాంతాలకు అవసరమైన వైద్య, నిత్యవసర సరుకుల రవాణా చేయడానికి ‘లైఫ్లైన్ ఉడాన్’ విమానాలను నడుపుతోంది.
హెలికాప్టర్ సేవల వినియోగం..
పవన్ హన్స్ లిమిటెడ్ సహా వివిధ సంస్థల హెలికాప్టర్ సేవలను కూడా వినియోగిస్తున్నారు. జమ్ము అండ్ కాశ్మీర్, లడాఖ్తో సహా వివిధ ద్వీప ప్రాంతాలు (ఐలాండ్స్) మరియు ఈశాన్య
ప్రాంతాలలో క్లిష్టమైన వైద్య సరుకు, రోగుల రవాణాకు ఈ హెలికాప్టర్ సేవలు వాడుతున్నారు.
పవన్ హన్స్ హెలికాప్టర్లు 4 మే 2020 వరకు 7,729 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 2.27 టన్నుల సరుకును రవాణా చేశాయి. ఈశాన్య ప్రాంతం, ద్వీప భూభాగాలు మరియు కొండ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టితో ఈ సేవలను వినియోగిస్తున్నారు. ఎయిర్ ఇండియా మరియు ఐఏఎఫ్ ప్రధాన సౌజన్యంతో జమ్ము అండ్ కాశ్మీర్, లడాఖ్, ఈశాన్య ప్రాంతం మరియు ఇతర ద్వీప ప్రాంతాలకు సేవలను విస్తరిస్తున్నాయి.
ప్రయివేటు సంస్థల భాగస్వామ్యంతోనూ..
దేశీయ కార్గో ఆపరేటర్లు స్పైస్ జెట్, బ్లూ డార్ట్, ఇండిగో మరియు విస్తారా సంస్థలు వాణిజ్య ప్రాతిపదికన సరుకు రవాణా విమానాలను నడుపుతున్నాయి. స్పైస్ జెట్ 13 మార్చి 6 నుండి మే 4, 2020 వరకు 796 కార్గో విమానాలను 13,61,141 కిలోమీటర్ల దూరం ప్రయాణింప జేసి 5,817 టన్నుల సరుకును రవాణా చేసింది. వీటిలో 290 అంతర్జాతీయ కార్గో విమానాలు కూడా ఉన్నాయి. మరోవైపు బ్లూ డార్ట్ సంస్థ మార్చి 25 నుండి 2020 మే 4 వరకు 266 కార్గో విమానాలను 2,94,928 కిలోమీటర్ల దూరం మేర ప్రయాణింపజేసి దాదాపు 4,522 టన్నుల సరుకును రవాణా చేసింది. వీటిలో దాదాపు 13 అంతర్జాతీయ కార్గో విమానాలూ ఉన్నాయి. ఇండిగో సంస్థ ఏప్రిల్ 3 నుండి 2020 మే 4 వరకు 90 కార్గో విమానాలను నడిపింది. మొత్తం 1,50,803 కిలోమీటర్ల దూరం మేర ఈ విమానాలు ప్రయాణించి దాదాపు 444 టన్నుల సరుకును రవాణా చేసింది. ఇందులో దాదాపు 34 అంతర్జాతీయ విమానాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ అవసరాల కోసం ఉచితంగా రవాణా చేసిన వైద్య సామాగ్రి కూడా ఇందులో ఉంది. మరోవైపు విస్తారా సంస్థ 19 ఏప్రిల్ నుంచి మే 4వ తేదీ వరకు దాదాపు 22 కార్గో విమానాలను నడిపించాయి. ఈ విమానాలు 30,614 కిలో మీటర్ల దూరం ప్రయాణించి 144 టన్నుల మేర సరుకును రవాణా చేశాయి.
తూర్పు ఆసియాతో వాయు వంతెన ఏర్పాటు..
తూర్పు ఆసియాతో ఔషధాలు, వైద్య పరికరాలు మరియు కోవిడ్ -19 ఉపశమన పదార్థాల రవాణా కోసం కార్గో ఎయిర్ బ్రిడ్జ్ (వాయు వంతెన)స్థాపించబడింది. ఎయిర్ ఇండియా తీసుకువచ్చిన మెడికల్ కార్గో పరిమాణం 956 టన్నులుగా ఉంది. దీనికి అదనంగా బ్లూ డార్ట్ సంస్థ ఏప్రిల్ 14 నుండి 2020 మే 4 వరకు గ్వాంగ్జౌ మరియు షాంఘై నుండి 114 టన్నుల మేర, హాంకాంగ్ నుండి దాదాపు 24 టన్నుల మేర వైద్య సామాగ్రిని రవాణా చేసింది. మరోవైపు స్పైస్జెట్ సంస్థ షాంఘై మరియు గ్వాంగ్జౌల నుండి మే 4వ తేదీ వరకు 204 టన్నుల వైద్య సామాగ్రిని, హాంగ్ కాంగ్ మరియు సింగపూర్ నుండి 16 టన్నుల వరకు వైద్య సామాగ్రిని రవాణా చేసింది.
***
(Release ID: 1621386)
Visitor Counter : 179