సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

పి.ఎం.ఈ.జి.పి. ప్రాజెక్టుల వేగవంతం చేసే మార్గాన్ని సుగమం చేసిన ప్రభుత్వం ; స్విఫ్ట్ ఎగ్జిక్యూషన్ నిర్ధారణ కోసం కె.వి.ఐ.సి.

Posted On: 01 MAY 2020 4:32PM by PIB Hyderabad

ముఖ్యమైన విధాన నిర్ణయాల్లో భాగంగా దేశంలో ఉపాధి కల్పన వేగం మరింత పెరగనుంది. కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ నేతృత్వంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (జి.ఎస్.టి.ఈ) జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ (డి.ఎల్.టి.ఎఫ్.సి) పాత్రను తొలగించింది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పి.ఎమ్.ఈ.జి.పి) కింద జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలను సిఫారసు చేయడం ద్వారా మొత్తం విధానాన్ని సరళీకృతం చేయనున్నారు.

సవరించిన మార్గదర్శకాల ప్రకారం, పి.ఎం.ఈ.జి.పి. పథకాన్ని అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీ అయిన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కె.వి.ఐ.సి) తగిన శ్రద్ధతో కాబోయే పారిశ్రామికవేత్తల ప్రతిపాదనలు/ దరఖాస్తులను నేరుగా ఆమోదిస్తుంది. అదే విధంగా రుణ నిర్ణయాలు తీసుకోవడానికి బ్యాంకులకు పంపుతుంది. ప్రస్తుతానికి ఈ ప్రతి పాదనలను డి.ఎస్.టి.ఎఫ్.సి. పరిశీలించింది. దీని వల్ల తరచూ ప్రాజెక్టుల మంజూరలో చాలా ఆలస్యం అవుతుందనే విషయాన్ని గమనించింది.

పి.ఎం.ఈ.జి.పి. కింద ప్రాజెక్టులను ఆమోదించడంలో డి.ఎల్.టి.ఎఫ్.సి. నిలిపివేయడంతో పెద్ద అడ్డంకి తొలగిపోయినట్లు కె.వి.ఐ.సి. ఛైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం వేగంగా చర్యలు తీసుకున్నందుకు కేంద్ర మంత్రి శ్రీ గడ్కరీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కోరనా వ్యాధి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ఉపాధి రంగం దెబ్బతిన్న తరుణంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఈ విధానంలోని సవరణ ప్రాజెక్టులను వేగంగా అమలు చేయడానికి మరియు పి.ఎం.ఈ.జి.పి. పథకం కింద గ్రామీణ మరియు చిన్న పట్టణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి మార్గం సుగమం చేసింది.

డి.ఎల్.టి.ఎఫ్.సి,కి నాయకత్వం వహిస్తున్న జిల్లా కలెక్టర్లు / న్యాయాధికారులు తరచూ స్థానిక పరిపాలనా సమస్యల్లో మునిగి తేలుతున్నారని, అందువల్ల పి.ఎం.ఈ.జి.పి. దరఖాస్తుల ఆమోదానికి సంబంధించిన పనుల విషయంలో వారు ప్రాధాన్యతను ఇవ్వడం లేదని గుర్తించారు. రోజూ జిల్లా కలెక్టర్లు నెలవారీ సమావేశాలను నిర్వహించడంలో విఫలమైనందున ఈ పథకం కింద ప్రతి పాదనలు చాలా నెలలుగా పెండింగ్ లో ఉన్నాయి. ఈ అడ్డంకిని అధిగమించాలని కోరుతూ ఛైర్మన్ కె.వి.ఐ.సి. శ్రీ సక్సేనా ఏప్రిల్ 20న కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీకి లేఖ రాసి, తక్షణమే ఈ విషయంలో చొరవ తీసుకోవాని అభ్యర్థించారు.

గౌరవ మంత్రి తమ అభ్యర్థనను అంగీకరించి, డిఎ.టి.ఎఫ్.సి, పాత్రను నిలపివేయాలని నిర్ణయించుకున్నందుకు కృతజ్ఞతలు తెల్పిన శ్రీ సక్సేనా, ఇది ప్రాజెక్టుల వేగాన్ని మరింత పెంచి సకాలంలో అమలుకు నోచుకునేలా చేస్తుందని, ప్రభుత్వ నిర్ణయం పి.ఎం.ఈ.జి.పి. కింద ఉపాధి అవకాశాలను కోరుకునే దేశంలోని లక్షలాది మంది ప్రజల ఆసక్తిని కాపాడుతుందని తెలిపారు.

ఈ విషయంలో 2020 ఏప్రిల్ 28న ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికే,న్ జారీ చేసింది. స్కీమ్ మార్గదర్శకాల్లో క్లాజ్ 11.9 ప్రకారం ఏర్పాటు చేయబడిన డి.ఎల్.టి.ఎఫ్.సి. పాత్రను ప్రతిపాదనల సిఫారసు / ఫైనాన్సింగ్ బ్యాంకులకు దరఖాస్తులు కోసం నిలిపివేయవచ్చని సమర్థ అధికారం నిర్ణయించింది.

విశేషం ఏమిటంటే, ప్రస్తుతం డి.ఎల్.టి.ఎఫ్.సి. స్థాయిలో పెండింగ్ లో ఉన్న అన్ని పి.ఎం.ఈ.జి.పి. దరఖాస్తులను కూడా అమలు చేసే ఏజెన్సీలు ఉపసంహరించుకోవచ్చు. మరియు క్రెడిట్ నిర్ణయాలు తీసుకున్నందుకు వెంటనే బ్యాంకులకు పంపవచ్చు.

కొత్త మార్గదర్శకాల ప్రకారం, దరఖాస్తులను స్వీకరించిన తర్వాత కె.వి.ఐ.సి. ప్రతిపాదనలను పరిశీలిస్తుంది మరియు సరిదిద్దబడిన దరఖాస్తులు క్రెడిట్ నిర్ణయాలు తీసుకోవడానికి బ్యాంకులకు పంపబడతాయి. పి.ఎం.ఈ.జి.పి. పథకం కింద తయారీ, సేవా పరిశ్రమలకు ర. 25 లక్షల వరకూ రుణాలు ఇస్తారు. ఇందులో వైశాల్యాన్ని బట్టి కె.వి.ఐ.సి. 15 నుంచి 35 శాతం సబ్సిడీని అందిస్తుంది.

కె.వి.ఐ.సి. బ్యాంకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో, స్కోరింగ్ షీట్ ను కూడా అభివృద్ధి చేస్తుంది మరియు పి.ఎం.ఈ.జి.పి. ఈ-పోర్టల్ లో అప్ లోడ్ చేస్తుంది. స్కోరింగ్ షీట్ ధరఖాస్తుదారులకు వారి దరఖాస్తులను వారి స్థాయిలో తీర్పు ఇవ్వడానికి మరియు ప్రక్రియలో పారదర్శకతను తీసుకొస్తుంది.

భారతదేశం అంతటా ఉపాధి అవకాశాలను కల్పించడంలో కె.వి.ఐ.సి. కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడం సముచితం. భారత ప్రభుత్వ ప్రధాన ఉపాధి కల్పన పథకం పి.ఎమ్.ఈ.జి.పి. ప్రతిరోజూ కొత్త విజయగాధలు నమోదు అవుతున్నాయి.

2008లో ప్రారంభించిన నాటి నుంచి పి.ఎం.ఈ.జి.పి. పథకం సంవత్సరానికి సగటున 35,000 దరఖాస్తులను అందుకోవడం గమనార్హం. ఏదేమైనా 2016లో కె.వి.ఐ.సి. ఇన్ హౌస్, యూజర్ ఫ్రెండ్లీ పి.ఎం.ఈ.జి.పి. పోర్టల్ ను అభివృద్ధి చేసింది. అలాగే ఈ పథకం కింద ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి జులై 2016లో ప్రారంభించింది. ఆన్ లైన్ సదుపాయం భారీ ప్రజా స్పందనను పొందింది. దానితో పాటు ఆన్ లైన్ దరఖాస్తుల సంఖ్య సంవత్సరానికి నాలుగు లక్షల వరకు అనేక రెట్లు పెరిగింది. ఈ పథకానికి ప్రజాదరణ బాగుంది.

దరఖాస్తుల సంఖ్య పెరగడంతో, ప్రాజెక్టుల సంఖ్య బాగా పెరిగింది. మరియు గత మూడేళ్ళలో కె.వి.ఐ.సి. పంపిణీ చేసిన సబ్సిడీ మొత్తం, పి.ఎం.ఈ.జి.పి. కింద ప్రాజెక్టుల సంఖ్య 2016-17లో 52,912 తో పోలిస్తే 2018-19లో 73,427 ప్రాజెక్టులు స్థాపించబడ్డాయి. ఈ కాలంలో సబ్సిడీ మొత్తం 2016-17లో రూ. 1281 కోట్ల నుంచి 2018-19లో రూ.2070 కోట్లకు పెరిగింది. 2017-18 సంవత్సరంలో 48,398 ప్రాజెక్టులు స్థాపించగా, కె.వి.ఐ.సి. 1312 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మొత్తం ఉపాధి 2016-17లో 4,07,840 మంది నుంచి 2018-19లో 5,87,416 మందికి పెరిగింది.

2019-20 సంవత్సరంలో కె.వి.ఐ.సి. 1951 కోట్లకు పైగా మార్జిన్ మనీ సబ్సిడీని విడుదల చేసి దేశంలో 66,653 ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది. కె.వి.ఐ.సి. 2019-20 సంవత్సరంలో రూ.2400 కోట్ల పంపిణీలో 77,000 ప్రాజెక్టుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే మార్చి 10 నుంచి 26 వరకు మోడల్ ప్రవర్తనా నియమావళి విధించడం వల్ల మూడు కీలకమైన నెలలు ముగియడంతో లక్ష్యం కంటే స్వల్పంగా పడిపోయింది. పార్లమెంటరీ ఎన్నికల కారణంగా మే 2019, మరో నెల, అనగా మార్చి 2020, కోవిడ్ -19 కారణంగా దేశంలో పూర్తి లాక్ డౌన్ కారణంగా ఉత్పాదకత తగ్గింది.

 

 

సంవత్సరం

ప్రాజెక్టుల సంఖ్య

విడుదల చేసిన ఎం.ఎ.

(రూ. కోట్లలో)

ఉపాధి

(సంఖ్య)

2016-17

52,912

1281.00

4,07,840

2017-18

48,398

1312.00

3,87,192

2018-19

73,427

2070.00

5,87,416

2019-20

66,653

1951.00

2,57,816

 

 

--



(Release ID: 1620147) Visitor Counter : 630