మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

హెచ్ఆర్డి మంత్రిత్వ శాఖ సలహా మేరకు ప్రస్తుత కోవిడ్-19 లాక్ డౌన్ పరిస్థితిలో బోధనను విద్యార్థులు చెంతకు తీసుకెళ్లడానికి పలు చర్యలు చేపట్టిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఢిల్లీ రీజియన్

దేశవ్యాప్తంగా విద్యార్థుల భద్రత, విద్యా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: కేంద్ర హెచ్ ఆర్ డి మంత్రి



VI నుండి VIII తరగతుల ఆన్ లైన్ ప్రత్యక్ష బోధనా ప్రసారాలు వచ్చే సోమవారం నుండి ప్రారంభించనున్న కేవీఎస్ ఢిల్లీ రీజియన్; IX నుండి XII తరగతులు ఇప్పటికే ప్రారంభం

Posted On: 11 APR 2020 6:35PM by PIB Hyderabad

ప్రపంచం కోవిడ్-19 లాక్ డౌన్ తో తల్లడిల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులుతల్లి దండ్రులకు ఇది పరీక్షా సమయం.  ఈ క్లిష్ట సమయంలో విద్యాసంస్థల అధిపతులుడిజిటల్ పద్ధతుల ద్వారా విద్యార్థులు సరైన రీతిలో సమయాన్ని వినియోగించుకునివిద్య సంవత్సరం నష్ట పోకుండా చూడాలని కేంద్ర మానవ వనరుల అభివుద్ది శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిషాంక్సూచించారు. ఈ మేరకు ఢిల్లీ ప్రాంతీయ కార్యాలయం ఫేస్ బుక్యూట్యూబ్ ఐడి లు రూపొందించి VI నుండి XII విద్యార్థులకు అన్ని పాఠ్యాంశాల బోధన ఏర్పాట్లు చేసారు. 

ఇప్పటికే IX నుండి XII తరగతులకు పేస్ బుక్యూట్యూబ్ లో  లైవ్ ఆన్ లైన్ బోధనకు  పెద్ద ఎత్తున  స్పందన వస్తోంది.  సుమారు 90,000 వీక్షణలు, 40,000 కామెంట్లు ఈ రెండు రోజుల్లోనే వచ్చాయి. 13,343 మంది సబ్ స్క్రైబ్ర్లు చేరారు.  అన్ని తరగతులుపాఠ్యాంశాలకు ఎంపిక చేసిన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బోధనా కార్యక్రమంలో పరస్పరం విద్యార్థులకు మధ్యలో వచ్చే సందేహాలను నివృతి చేసే అవకాశం కూడా ఉంది. ముందుగానే అన్ని పాఠ్యాంశాలకు కాలపట్టికను రూపొందించి విద్యాసంస్థల వాట్సాప్ గ్రూప్ ల ద్వారా సమాచారాన్ని విద్యార్థులకు చేరవేశారు. యూట్యూబ్ లో ప్లే లిస్ట్ ను కూడా రూపొందించి పాఠాలను విద్యార్థులు చూసుకునే అవకాశం కల్పించారు. 

విద్య అంశాలను వీడియోల రూపంలో తయారు చేయడానికి మూవీమేకర్పవర్ పాయింట్ విండోలుస్క్రీన్ రికార్డర్ వంటి వివిధ సాఫ్ట్ వేర్ లను ఉపయోగించారు. హోంవర్క్ఇంటి దగ్గర నుండి చేసే అభ్యాసాలను ఉపాధ్యాయులు సిద్ధం చేసి ఎప్పటికప్పుడు విద్యార్థులకు పంపుతున్నారు. గతంలో రోజువారీలా కాకుండా కాస్త వైవిధ్యంగా పరస్పరం అభ్యాస కార్యక్రమం జరుగడం విద్యార్థులకు ఆసక్తి కలిగిస్తుంది. 

image.png
image.png
image.png
image.png
image.png
 

ప్రైమరీ తరగతులకు చెందిన చిన్నారుల కోసం ఉపాధ్యాయులు- వీడియోలు రూపొందించి వాట్సాప్యూట్యూబ్ లోని అప్లోడ్ చేస్తున్నారు. విద్యార్థులు తల్లి దండ్రులు కామెంట్ సెక్షన్ లో ప్రస్తావించే సమస్యలకు ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు సమాధానాలు చెబుతుంటారు. సామజిక దూరంఇళ్లల్లోనే విద్యార్థులుతల్లిదండ్రులను సురక్షితంగా ఉండాలని కోరడం మంచి ఫలితాలు ఇస్తోంది. వారికి స్వయందీక్షఈ-పాఠశాల వంటి బోధనా వనరులను  పూర్తి అందుబాటులోకి తెచ్చారు. హోంవర్క్అసైన్మెంట్ లను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు పరిశీలిస్తారు. రోజుకు కనీసం అయిదుగురు విద్యార్థులతో వారు మాట్లాడుతారు. ఇలా జరుగుతున్న బోధనా విధానం అటు విద్యార్థులుతల్లి దండ్రులకు ఆసక్తికరంగా ఉండడమే కాకుండావారు పూర్తిగా దీనిలో భాగస్వామ్యం అవుతున్నారు. అలాగే ఉపాధ్యాయులు కూడా తగు రీతిలో పాఠ్యాంశాల బోధనకు ఉపక్రమిస్తున్నారు. 

                                                                        ****

 
 
 


(Release ID: 1613502) Visitor Counter : 153