రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కోవిడ్ పోరాట యోధుల‌కు కవరాల్సిన్‌ తయారీ ఫ్యాబ్రిక్‌ను ప‌రీక్షించ‌డానికి..

యుపీ, తమిళనాడుల‌లోని ఓఎఫ్‌బీ యూనిట్లు రూపొందించిన‌ ప‌రీక్షా ప‌రిక‌రాల‌కు ఎన్ఏబీఎల్ అనుమతులు

Posted On: 11 APR 2020 5:13PM by PIB Hyderabad

కోవిడ్‌-19 వైర‌స్ రోగుల‌కు చికిత్స‌ను అందించేందుకు ముందుండి పోరాటం చేస్తున్న
వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల మేటి ర‌క్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన క‌వ‌రాల్సిన్‌ను దేశీయంగానే భారీగా త‌యారు చేసేందుకు వీలుగా గొప్ప ప‌రిణామం చోటు చేసుకుంది. క‌వ‌రాల్సిన్‌ను త‌యారు చేసేందుకు అవ‌స‌ర‌మైన ఫ్యాబ్రిక్‌ను ప‌రీక్షించేందుకు గాను ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీ బోర్డుకు (ఓఎఫ్‌బీ) చెందిన రెండు యూనిట్లు త‌యారు చేసిన ప‌రీక్షా ప‌రిక‌రాల‌కు నేష‌న‌ల్ అక్రిడిటేష‌న్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ‌రేష‌న్ లాబ‌రేట‌రీస్ (ఎన్ఏబీఎల్‌) అనుమ‌తుల‌ను జారీ చేసింది. ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని కాన్పూర్‌లో గ‌ల స్మాల్ ఆర్మ్స్ ఫ్యాక్ట‌రీ (ఎస్ఏఎఫ్‌), త‌మిళ‌నాడులోని అవాడిలో గ‌ల హెవీ వెహిక‌ల్స్ ఫ్యాక్ట‌రీ (హెచ్‌వీఎఫ్‌) యూనిట్ల వారు త‌యారు చేసిన ప‌రిక్షా ప‌రిక‌రాలు ఏఎస్‌టీఎం ఎఫ్ 1670: 2003 మరియు ఐఎస్‌వో 16603: 2004 నాణ్య‌తా ప్రమాణాలకు లోబ‌డి ఉన్న‌ట్టుగా ఎన్ఏబీఎల్ తెలిపింది.
కేవ‌లం ప‌క్షం రోజుల్లోనే అభివృద్ధి..
కోవిడ్‌పై పోరుకు ముందు వ‌రుస‌లో నిలిచి వైద్య‌ సేవ‌లందిస్తున్న వారికి మేటి ర‌క్ష‌ణ కోసం క‌వ‌రాల్సిన్‌ను త‌యారు చేసే ఫ్యాబ్రిక్‌ టెస్ట ఫ‌ర్ బ్ల‌డ్ పెనెట్రీష‌న్ రెసిస్టెన్స్ ప‌రీక్ష‌ను త‌ట్టుకొని నిల‌వాల్సి ఉంటుంది. క‌వ‌రాల్సిన్‌ను త‌యారు చేసేందుకు ముడి స‌రుకుగా వాడే ఫ్యాబ్రిక్‌ నిర్దిష్ట కాలానికి వేర్వేరు పీడన స్థాయిలలో ‘సింథటిక్ బ్ల‌డ్‌’కు ఎక్స్‌పోజ్ అవ‌కుండా నిల‌వాలి. క‌వ‌రాల్సిన్ త‌యారీ ఫ్యాబ్రిక్ సామ‌ర్థ్యపు ప‌రీక్ష‌లు నిర్వ‌హించి అనుమ‌తులు జారీ చేసే ఉప‌క‌ర‌ణాలు మొత్తం దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం కోయంబత్తూర్‌లో గ‌ల‌ సౌత్ ఇండియా టెక్స్‌టైల్ రీసెర్చ్ అసోసియేషన్(సిట్రా)లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లులో ఉన్న కార‌ణంగా స‌రైన లాజిస్టిక్స్ స‌దుపాయం లేకుండా పోయింది. ఈ కార‌ణంగా దేశంలో భారీ మొత్తంలో క‌వ‌రాల్సిన్ త‌యారు చేయ‌డానికి ఈ ప‌రీక్ష‌లు పెద్ద అవ‌రోధంగా మారాయి. ఈ నేప‌థ్యంలో ఈ ప‌రీక్షా ప‌రిక‌రాల త‌యారీని వివిధ అర్డినెన్స్ ప్యాక్ట‌రీల మిషన్మోడ్‌లో తీసుకొని కేవ‌లం ప‌క్షం రోజుల్లో అభివృద్ధి చేశాయి.
దేశీయంగా భారీ ఉత్ప‌త్తికి అవ‌కాశం..
తాజా ప‌రిణామంతో సిట్రాతో పాటు దక్షిణ భారత దేశంలో మరొక పరీక్ష సౌకర్యం అందుబాటులోకి రానుంది. మ‌రోవైపు ఉత్తర భారతదేశంలో మొద‌టి సారిగా ఫ్యాబ్రిక్ ప‌రీక్ష కేంద్రం అందుబాటులోకి రానుంది. ఫ‌లితంగా ఓఎఫ్‌బీ నేతృత్వంలో బట్టల కర్మాగారాలలో క‌వ‌రాల్సిన్ ఉత్పత్తిని భారీగా పెంచడానికి వీలు క‌లుగ‌నుంది. యూపీలోని నాలుగు, త‌మిళ‌నాడులోని ఒక క‌ర్మాగారంలో వీటి ఉత్ప‌త్త‌కి వీలు క‌లుగనుంది. దీనికి తోడు క‌వ‌రాల్సిన్ త‌యారీలో నిమ‌గ్న‌మైన ఇత‌ర ఎజెన్సీల వారికి కూడా కీల‌క‌మైన‌ ఫ్యాబ్రిక్ అనుమ‌తులను సుల‌భంగా పొందేందుకు వీలు ప‌డ‌నుంది.



(Release ID: 1613397) Visitor Counter : 172